వైఎస్సార్టీపీ రామగుండం నియోజకవర్గ ఇన్చార్జి జిమ్మిబాబు ఆ పార్టీని వీడారు. బుధవారం హైదరబాద్లోని ప్రగతి భవన్లో రామగుండం ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో గులాబీ పార్టీలోకి చేరారు.
ఆయనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అమాత్యుడు మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యేగా కోరుకంటిని 50 వేల మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే వెంట ఆ పార్టీ నాయకులు కౌశిక హరి, కౌటం బాబు, గోపు ఐలయ్య ఉన్నారు.
-గోదావరిఖని, నవంబర్ 8