అంతర్గాం, నవంబర్ 17: ‘యాభై ఏండ్ల పాలనలో మన బతుకులను ఆగం చేసిన కాంగ్రెస్ను తరిమికొట్టండి..తొమ్మిదిన్నరేండ్ల పాలనలో వెలుగులు నింపిన బీఆర్ఎస్ను ఆదరించండి’ అంటూ రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకం టి చందర్ ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం అంతర్గాం మండలంలోని లింగాపూర్లో బీఆర్ఎస్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి నారదాసు లక్ష్మణ్రావుతో కలిసి ప్రచారం నిర్వహించారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు గ్రామస్తులు సా దర స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులిచ్చి ఆశీర్వదించారు. ఈసందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలన సంక్షేమానికి స్వర్ణయుగమని చెప్పారు.
‘హనుమంతుడి గు డిలేని ఊరు లేదు..ప్రభుత్వ పథకం అందని ఇల్లులేదు’ అంటే అతిశయోక్తికాదని వ్యాఖ్యానించారు. కార్పొరేషన్లో విలీనమైన లింగాపూర్ను తిరిగి పంచాయతీగా ఏర్పాటు చేయించానన్నారు. సీ ఎం కేసీఆర్ సబ్బండ జనులకు లబ్ధి కలిగేలా మ్యా నిఫెస్టోనూ రూపొందించారని చెప్పారు. బీఆర్ఎస్ గెలిపిస్తే రైతుబంధు ఎకరాకు రూ. 16వేలు, రేషన్కార్డుదారులకు రూ. 5లక్షల బీమా, ఆసరా రూ. 5వేలు, సౌభాగ్యలక్ష్మి ద్వారా నిరుపేద మహిళలకు ప్రతినెలా రూ.3వేల భృతి, రూ.400కే గ్యాస్ సి లిండర్ ఇస్తామని హామీ ఇచ్చారు.లింగపూర్ ఎస్సీ కాలనీకి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వచ్చేలా కృషి చేస్తానని ప్రకటించారు. ప్రజలు ఆలోచించి కారు గుర్తు పై ఓటేసి తనను ఆశీర్వదించాలని అభ్యర్థించారు.
నారదాసు లక్ష్మణ్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ను నమ్మితే మోసపోతామన్నారు. ప్రజల కోసం పరితపిస్తున్న కోరుకంటి చందర్ను గెలిపించాలని కోరారు. తెచ్చుకున్న తెలంగాణను దోపిడీదారుల చేతుల్లో పెట్టవద్దన్నారు. ఏమాత్రం ఎమరుపాటుగా ఉన్న మళ్లీ గోసపోడాల్సి వస్తుందని హెచ్చరించారు. కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎంగా చూడాలన్నారు. కార్యక్రమంలో అంత ర్గాం జడ్పీటీసీ అముల నారాయణ, మాజీ స ర్పంచ్ ఆర్శనపల్లి మల్లేశ్వరీ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ ఇరికిళ్ల పద్మా శంకరయ్య, నాయకులు తిరుపతి నాయక్, నిమ్మరాజుల సాగర్, ఆర్శనపల్లి రాజు, నిమ్మరాజుల రవి, కందుల సత్తయ్య, సా యి భూషణ్, ఆముల సరన్ పాల్గొన్నారు.