మెట్పల్లి రూరల్, జూన్ 22: ప్రత్యేక తెలంగా ణ సాధనలో భాగంగా తమ ప్రాణాలను అర్పించిన అమరుల త్యాగాలు అజరామరమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు పేర్కొన్నా రు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం మెట్పల్లి మండలం సత్తక్కపల్లి శివారులోని 63వ నం బరు జాతీయ రహదారిపై తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం అమరవీరులను స్మరించుకుంటూ వారి ఆత్మశాంతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ, విద్యార్థులు, యువత బలిదానంతోనే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని తెలిపారు. తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆ దుకుందని పేర్కొన్నారు.
అమరుల ప్రాణత్యాగాలతో ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రం సీఎం కేసీఆర్ నా యకత్వంలో బంగారు తెలంగాణగా మారుతుందని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ప థకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు డా. కల్వకుంట్ల సంజయ్, ఎంపీపీ మారు సాయిరెడ్డి, ఆర్డీఓ వినోద్కుమార్, ఎంపీడీఓ భీమేశ్రెడ్డి, వైస్ ఎంపీపీ పోతుగంటి రాజేందర్, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.