మానకొండూర్ రూరల్, జనవరి 6: సంక్షేమ పథకాల అమలుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపడుతున్నదని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలోని ఊటూర్ గ్రామంలో శనివారం ప్రజాపాలన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దరఖాస్తులను ఆన్లైన్ చేయనున్నట్లు తెలిపారు.
రేషన్ కార్డు లేని వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎలగందుల సుదర్శన్, ఎంపీపీ ముద్దసాని సులోచన-శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ సీహెచ్ రాజు, ఎంపీటీసీ గోపు మమత-శ్రీనివాస్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.