జగిత్యాల కలెక్టరేట్, డిసెంబర్ 27: గ్రామ పంచాయతీల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర అత్యంత కీలకమని, సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శుల పని తీరుతోనే స్వచ్ఛ సర్వేక్షన్లో జిల్లా, జాతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకున్నామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల రూరల్ మండల పంచాయతీ కార్యదర్శులు బుధవారం ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
రెండో సారి విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలియజేశా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్కుమార్ మాట్లాడారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రా మాల్లో పల్లె ప్రకృతివనం, వైకుంఠధామాల నిర్మాణం, వర్మి కంపోస్టు షెడ్ వంటి వాటిని నిర్మించామన్నారు. హరితహారం ద్వారా పచ్చదనం, పరిశుభ్రతలో తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. కరోనా సమయం లో పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణను పటిష్ఠంగా అమలు చేస్తూ, కరోనా వ్యాప్తి చెందకుండా అవగాహన కార్యక్రమాలను చాలా చక్కగా నిర్వహించారని కొనియాడారు.
పంచాయతీ కార్యదర్శుల వేతనాన్ని రూ.15 వేల నుంచి రూ.29వేలకు పెంచిన ఘనత కేసీఆర్దే అన్నారు. ఆరు గ్యారంటీలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాల్సిన బాధ్యతను ప్రజాప్రతినిధులతో పాటు పంచాయతీ కార్యదర్శులు సైతం తీసుకోవాలన్నారు. కాగా జగిత్యాలలోని ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ ఉమెన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వై. సత్యనారాయణ, అధ్యాపక బృందం ఎమ్మెల్యే సంజయ్కుమార్ను క్యాంపు కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలి సి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.