జగిత్యాల రూరల్/సారంగాపూర్ డిసెంబర్ 30: కాంగ్రెస్ ప్రభుత్వం మ్యానిఫెస్టోలోని అంశాలను అమలు చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కోరారు. శనివారం జగిత్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో మండలానికి చెందిన 21 మందికి, జగిత్యాల అర్బన్ మండలానికి చెంది న నలుగురికి, సారంగాపూర్ రైతు వేదిక ఆవరణలో 31 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు. అనంతరం ఆయాచోట్ల ఎమ్మెల్యే మాట్లాడుతూ, కేసీఆర్ అన్నివర్గాలకు కల్యాణలక్ష్మి పథకాన్ని అందించారన్నారు.
చెక్కుల పంపిణీ కార్యక్రమానికి అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే అధికారులు ఫ్లె క్సీ ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. కల్యాణలక్ష్మి పథకంలో భాగంగా తాను స్వయంగా మహిళలకు ఇచ్చే చీర కానుకను యథావిధిగా అందిస్తానని స్పష్టం చేశారు. గ్రామాల్లో బెల్ట్ షాపులను రద్దు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇంకా అమలు కాలేదని గుర్తు చేశారు. డిగ్రీ చదివే యువతులకు స్కూటీ ఇస్తామని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారని, వాటిని అమలు చేయాలని అన్నారు. ప్రజాపాలన దరఖాస్తులు దళారులకు అనుకూలంగా ఉన్నాయని అన్నారు.
జడ్పీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, ఆడబిడ్డలకు ఎమ్మెల్యే సంజయ్ సొంత ఖర్చు తో కానుకలు ఇస్తుంటే అధికార పార్టీ నాయకులు తప్పుబట్టడం చాలా బాధాకరం అని అన్నారు. రైతులు సాగు ప్రారంభించినప్పటికీ ఇంత వరకు రైతు బంధు అమలు కాలేదన్నా రు. నూతన రేషన్ కార్డులు మంజూరు చేసిన తర్వాత ప్రజాపాలను పెడితే బాగుండేదేని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజలకు దరఖాస్తులు అందుబాటులో లేకపోవడం గందరగోళం కలిగిస్తున్నదన్నారు.
జగిత్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో జడ్పీటీసీ మహేశ్, ఎంపీపీ రాజేంద్రప్రసాద్, మాజీ ఏఎంసీ చైర్మన్ దామోదర్ రావు, బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల ముకుందం, సర్పంచుల ఫోరం అధ్యక్షులు చెరుకు జాన్, సర్పంచులు తిరుపతి, ప్రవీణ్, మహేశ్వర్ రా వు, సరోజన-మల్లారెడ్డి, సత్తమ్మ-గంగారాం, తిరుపతి, గంగనర్సు, రాజ న్న, మమత, సతీశ్, ప్రభాకర్, అంజయ్య, స్వప్న, రాజేశ్వర్రెడ్డి, నారాయణ, లక్ష్మి, శంకర్, సురేంధర్ రెడ్డి, గంగాధర్, ఆనంద్ రావు, రాజిరెడ్డి, శేఖర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సారంగాపూర్, డిసెంబర్ 30: ఒడ్డెరకాలనీ గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవన్నాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజ య్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ అన్నిరంగాల్లో ముందు వరుసలో ఉందన్నారు. కాం గ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో యు వతకు మొండిచేయి చూపిందని విమర్శించారు. యువ వికాసం పథకాన్ని హైదరాబాద్ యూ త్ డిక్లెరేషన్లో చెప్పారని, ఇప్పడు దాని ఊసేలేదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రొటోకాల్ విషయంలో కక్ష సాధింపు చర్యలకు ఉపక్రమించిందన్నారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ మేడిపెల్లి మనోహర్ రెడ్డి, వైస్ ఎంపీపీ సోల్లు సురేందర్, పార్టీ మండలాధ్యక్షుడు గుర్రాల రాజేందర్ రె డ్డి, ప్రధాన కార్యదర్శి తోడేటి శేఖర్ గౌడ్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు జోగినిపెల్లి సుధాకర్రావు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు పల్లపు వెంకటేశ్, జమున, ఎడమల జ య-లక్ష్మారెడ్డి, శ్రీలత-శ్రీనివాస్, పాంపర్తి లక్ష్మి, అర్రె లక్ష్మి, సింగిల్ విండో చైర్మన్ గురునాథం మల్లారెడ్డి, వైస్ చైర్మన్ బాపిరాజు, మం డల యూత్ అధ్యక్షుడు మదన్కుమార్, జాగృ తి అధ్యక్షుడు బైరవేని మహేశ్, రమేశ్, జగన్, సాంబారి గంగాధర్, బందెల రవి, నర్సింహారెడ్డి, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.