కోరుట్ల, జనవరి 24: ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే డా క్టర్ సంజయ్ కల్వకుంట్ల తెలిపారు. కోరుట్ల పట్టణంలోని మున్సిపల్ సమావేశ మందిరంలో బుధవారం మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య అధ్యక్షతన నిర్వహించిన మున్సిపల్ అత్యవసర సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. పార్టీలకతీతంగా అన్ని వార్డుల్లోని సమస్యలను పరిష్కరించుకునేందుకు సమష్టిగా కృషి చేద్దామన్నారు.
ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధిలో భాగస్వాములు కావాలని మున్సిపల్ అధ్యక్షురాలు అన్నం లావణ్య కోరారు. అంతకుముందు అధికారులు పలు అభివృద్ధి పనుల ఆమోదం, బిల్లుల చెల్లింపు కోసం 3 ఎజెండా అంశాలు సభలో ప్రవేశపెట్టగా కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా అమోదించారు. సమావేశంలో మున్సిపల్ ఉపాధ్యక్షుడు పవన్, కమిషనర్ రాజేశ్వర్, డీఈఈ అభినయ్, ఏఈ లక్ష్మి, టీపీవో ప్రవీణ్, టీపీఎస్ రమ్య, మేనేజర్ శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, జేఏవో శివ పాల్గొన్నారు.
మెట్పల్లి, జనవరి24: రాజకీయాలకతీతంగా పట్టణాభివృద్ధికి కృషి చేద్దామని కోరుట్ల శాసనసభ్యుడు డా. కల్వకుంట్ల సంజయ్ అన్నారు. బుధవారం మెట్పల్లి మున్సిపల్ చైర్పర్సన్ రాణవేని సుజాత అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సాధారణ సమావేశానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. అన్ని వార్డుల్లో డ్రైనేజీ, తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. అనంతరం సమావేశంలో ప్రవేశపెట్టిన తొమ్మిది అంశాలతో కూడిన ఎజెండాకు కౌన్సిలర్లు చేతులెత్తి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
మున్సిపల్ పరిధిలోని ఏఖీన్పూర్ శివారు నుంచి బైపాస్ రోడ్డు నిర్మాణంతో విలువైన భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులను ఆదుకోవాలని కౌన్సిలర్ గుండోజి శ్రీనివాస్ ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. కోరుట్లలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి నివేదించేందుకు మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. సమావేశంలో మున్సిపల్ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్రావు, కమిషనర్ జగదీశ్వర్గౌడ్, అధికారులు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
కోరుట్ల, జనవరి 24: పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బుధవారం గణేశ్ భక్త మండలి ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ఆవిష్కరించారు. ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య, ఉపాధ్యక్షుడు గడ్డమీది పవన్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్, రాష్ట్ర కార్యదర్శి రేగుల శ్రీకాంత్ తదితరులున్నారు.