రాయికల్, నవంబర్4: ‘తెలంగాణ రాకముందు గ్రామాలు గ్రామాలు ఎట్లుండె. ఇప్పుడెట్ల ఉన్న యి. నాడు కరెంట్ ఉన్నదా..? నీళ్లు ఉన్నయా..? అభివృద్ధి ఉందా..? సంక్షేమం ఉన్నదా..? మీ ముఖాల్లో సంతోషం ఉన్నదా..? ఏదీ లేదు. కానీ స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఇంటింటికీ సంక్షేమం, ఊరూరా అభివృద్ధి కార్యక్రమాలతో సబ్బండవర్గాల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. ఇవ్వాళ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది’ అని జగిత్యాల అభ్యర్థి, ఎమ్మెల్యే డా. ఎం సంజయ్కుమార్ పేర్కొన్నారు.
శనివారం రాయికల్ మండ లం మైతాపూర్, ఇటిక్యాల గ్రామాల్లో ఎమ్మెల్సీ ఎల్. రమణతో కలిసి విస్తృత ప్రచారం చేశారు. అనంతరం మైతాపూర్లో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెప్పేవన్నీ అబద్ధాలేనని, నమ్మితే మోసపోతార న్నారు. నియోజకవర్గంలోని గ్రామాలను పట్టణాలకు దీటుగా అభివృద్ధి చేశానని, రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ తనకు మద్దతు పలికి మరొకసారి ఆశీర్వదించాలని కోరారు. మైతాపూర్లో ఈ పదేళ్ల కాలంలో రూ.41.45 కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు.
గ్రామంలో 982 మందికి ఆసరా పథకం కింద 884 మందికి రైతుబంధు, ఏడుగురికి రైతు బీమా, 130 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా లబ్ధి కలిగినట్లు చెప్పారు. ఇటిక్యాలలోనూ రూ.64.60 కోట్లతో అభివృద్ధి చేశామని, గ్రామంలో ఇప్పటివరకు 1413 మందికి ఆసరా పెన్షన్, 2210 మం దికి రైతుబంధు, 8 మందికి రైతు బీమా, 227 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అందించినట్లు చెప్పారు. అనంతరం ఎమ్మెల్సీ రమణ మాట్లాడారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే సంజయ్ కుమార్ను భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు. ఇక్కడ సర్పంచులు అజారుద్దీన్, సామల లావణ్య వేణు ఉన్నారు.
ఇటిక్యాలకు చెందిన గౌడ సంఘ నాయకులు, 50 మంది యువకులు, 150 మంది మహిళలు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు పోతవేణి రాజేందర్ గౌడ్, మైనార్టీ నాయకులు పార్టీలో చేరగా, వారికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే కుమ్మరిపల్లికి చెందిన ఉప్పుమడుగు సింగిల్ విండో డైరెక్టర్ సంకె దీనతోపాటు 50 మంది మహిళలు, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 30 మంది యువకులు ఎంపీటీసీ దొంతి నాగరాజు, పార్టీ గ్రామ మహిళ అధ్యక్షురాలు పావని ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ధర్మాజీపేట వార్డు సభ్యులు బాణావత్ రాజేందర్ నాయక్, రాజేశం, రాజేందర్ యాదవ్, పదిమంది కాంగ్రెస్ నాయకులు ఎంపీపీ సంధ్యారాణిసురేందర్ నాయక్ ఆధ్వర్యంలో పార్టీలో చేరగా, వారికి ఎమ్మెల్యే డా. సంజయ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.