పెద్దపల్లి (నమస్తేతెలంగాణ)/ పెద్దపల్లి, డిసెంబర్ 3: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రజా తీర్పు ను శిరసావహిస్తున్నామని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఆర్ఎస్ గెలుపు కోసం నిరంతరం పని చేసిన ప్రతి కార్యకర్తకు, ప్రేమతో ఓటేసి ఆశీర్వదించిన 63 వేలమంది ఓటరు మహాశయులకు కృతజ్ఞతలు తెలియజేశారు. సాధారణ కార్యకర్తగా బీఆర్ఎస్లో చేరిన తనకు పార్టీ అవకాశం ఇచ్చిందని, పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా తనకు అవకాశం ఇవ్వడం ఈ జన్మలో మర్చిపోలేనన్నారు.
పదేళ్లుగా బీఆర్ఎస్ కార్యకర్తగా, నాయకుడిగా, ఎమ్మెల్యేగా తనను ఆదరించిన ప్రతి ఒకరికి ధన్యవాదాలు తెలిపారు. రెండుసార్లు తనకు ఎమ్మెల్యేగా, పార్టీకి అధికారం ఇచ్చిన పెద్దపల్లి ని యోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేనని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా పదేండ్లపాటు తనకు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో సహకరించిన ప్రజలకు, ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ ఛైర్మెన్లు, మార్కెట్మిటీ ఛైర్మెన్లు, వైస్ ఛైర్మెన్లు, డైరెక్టర్లు, వైస్ ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు,
మండల రైతు కో-ఆర్డినేటర్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు , డైరెక్టర్లు, గ్రామశాఖ అధ్యక్షులు, రైతుబంధు సమితి గ్రామ కో-ఆర్డినేటర్లు, మాజీ ప్రజాప్రతినిధు లు, బీఆర్ఎస్ ప్రజా ప్రతి నిధులు, నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.