ఎలిగేడు, నవంబర్ 20: ‘కాంగ్రెస్ వస్తే సంక్షోభాలు తలెత్తుతయ్..కరువు కాటకాలు వత్తయ్..పాలనలో స్థిరత్వం లేక రాష్ట్రం ఆగమయ్యే పరిస్థితి ఉంటది.’ అంటూ పెద్దపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి ఉద్ఘాటించారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి రాకముందు తెలంగాణ ఎట్లున్నదో..నేడు ఏ విధంగా మారిందో.. ప్రజ లు ఆలోచించాలని కోరారు. చెయ్యి గుర్తుకు ఓటేసి కష్టాలు తెచ్చుకోవద్దన్నారు. కారు గుర్తుకు ఓటేసి అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం ఎలిగేడు, సుల్తాన్పూర్, నారాయణపల్లి, శివపల్లి, నర్సాపూర్ గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారం చేశారు.
కా ర్యకర్తలతో ర్యాలీ తీశారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఫ్రీ కరెం ట్, మిషన్ కాకతీయ, రైతుబీమా తదితర పథకాలు అమలు చేశారని చెప్పారు. ప్రజలంతా మావెంటే ఉన్నారని మ నోహర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎలిగేడులో నిలిచి పోయిన అంతర్గత రోడ్డు వెడల్పు పనులను తిరిగి తమ ప్రభుత్వం రాగానే పూర్తిచేస్తామని, అదే విధంగా గర్రెపల్లి నుంచి సుల్తాన్పూర్ శివారు వరకు పూర్తయిన డబుల్ రో డ్డును పెట్రోల్ బంకువరకు వేయిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బైరెడ్డి రాంరె డ్డి, జడ్పీటీపీ మండిగ రేణుకారాజనర్సయ్య, ఎంపీపీ తానిపర్తి స్రవంతీమోహన్రావు, ధూళికట్ట విండో మాజీ చైర్మన్ కొక్కిరాల మహేశ్వరరావు, మాజీ ఎంపీపీ లక్ష్మీదుర్గయ్య,
ఆర్బీఎస్ మండల, గ్రామ అధ్యక్షులు నార్నేని సుధాకర్రావు, కొత్తిరెడ్డి శరత్రెడ్డి, లోకపేట మాజీ సర్పంచ్ వొద్ది ప్రసాదరావు, ఎంపీటీసీ కొత్తిరెడ్డి ప్రేమలతాకమలాకర్రెడ్డి, కో-ఆప్షన్ మెంబర్ ఎండీ ఖలీల్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నారాయణపల్లి సర్పంచ్ మాడ కొండాల్రెడ్డి, ఎలిగే డు ప్యాక్స్ చైర్మన్ జీవీబీ రెడ్డి, సర్పంచులు పెద్దోల్ల ఐల య్య, రాచర్ల కొండయ్యరాజా, గోపు విజేందర్రెడ్డి, తంగెళ్ల స్వప్న-కుమార్యాదవ్, నాయకులు బద్దం తిరుపతిరెడ్డి, కల్లెం శ్రీనివాసరెడ్డి, కొత్తిరెడ్డి శాంతిరెడ్డి, కొత్తపల్లి ఆనందరావు, తానిపర్తి సుధాకర్రావు, సంజీవరావు, ఉపసర్పంచ్ సబ్బు శ్రీధర్, న్యాతరి పోచాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎలిగేడు అంబేద్కర్ కూడలిలో తొగర్రాయి గ్రామస్తుడు బీజేపీ నాయకుడు లింగారెడ్డితో పాటుగా పలువురు ఎమ్మెల్యే దాసరి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరిలో ఎలిగేడుకు చెందిన బింగి రాజు సుల్తానాబాద్కు చెందిన ప్రేంచందర్రావు, వలుస నీలయ్య ఉన్నారు.
పెద్దపల్లి, నవంబర్20: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతు చేయాలని పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చా రు. పెద్దపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జూలపల్లి మండలం వడాపూర్కు చెందిన నాయకులు నరేశ్, సృజన్, నవీన్, అభిలాష్, రాకేశ్, పవన్, వెంకటేశ్, హరీశ్, నరేశ్, ఓదెలు, రమేశ్, రంజిత్, ప్రవీణ్, శ్రీకాంత్, శ్రీనాథ్, ఎండీ బాబా బీఆర్ఎస్లో చేరగా గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడారు. కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఉద్బోధించారు. ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టాలన్నారు. బీఆర్ఎస్ను గెలిపిస్తే అమ లు చేయనున్న పథకాల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో నియోజకవర్గ బీఆర్ఎస్ ఎ న్నికల ఇన్చార్జి సర్ధార్ రవీందర్సింగ్, వైస్ ఎంపీపీ మొ గురం రమేశ్, సర్పంచ్ మహంకాళి తిరుపతి, నాయకులు పుల్లూరి శ్రీనివాసరావు, పుల్లూరి కృపాకర్ రావు, ఎర్రోళ్ల రాములు, వేల్పుల ఓదెలు, సుంకే శ్రీను పాల్గొన్నారు.
పెద్దపల్లి, నవంబర్ 20: బీఆర్ఎస్ నుంచి పలు పార్టీలోకి వెళ్లిన కార్యకర్తలు తిరిగి సొంత గూటికి చేరుతున్నా రు. ఆ పార్టీ నాయకుల విధానాలు నచ్చక తిరిగి గులాబీ కండువా కప్పుకుంటున్నారు. తాజాగా పెద్దపల్లి మండలంలోని తురలమద్దికుంటకు చెందిన సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు కల్లపల్లి విజయ్ కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ లో చేరాడు. కాంగ్రెస్ విధానాలు నచ్చక తిరిగి సోమవారం పెద్దపల్లిలో మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి సమక్షంలో తిరిగి గులాబీ కండువా కప్పుకున్నాడు. కార్యక్రమంలో కౌన్సిలర్ రేవెల్లి స్వామి, నాయకులు కాశిపాక వాసు, వెన్నం రవీందర్, లవన్, శ్రీధర్ పటేల్ పాల్గొన్నారు.