పెద్దపల్లిలో ఆదివారం సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే వేంకటేశ్వర స్వామి కల్యాణ మనోహత్సవానికి నియోజకవర్గ ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని, ప్రతి గడపా కదలాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కల్యాణానికి హాజరయ్యే భక్తులు సంప్రదాయ దుస్తుల్లో వచ్చి తిలకించాలని కోరారు. టీటీడీ నుంచి విగ్రహాలను తెప్పించి కల్యాణం జరిపిస్తున్నట్లు చెప్పారు. టీటీడీ ఆధ్వర్యంలో జరిగే క ల్యాణ వేడుకను ప్రజలు తిలకించాలనే ఉద్దేశ్యం తో పెద్దపల్లిలో వేడుక నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. హాజరయ్యే ప్రతి ఒక్కరికి తిరుపతి లడ్డూ ఇస్తామని, అన్నదానం చేస్తున్నామని వివరించా రు. భక్తులకు అన్నీ సౌకర్యాలను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ పెద్దపల్లి పట్టణ శాఖ అధ్యక్షుడు ఉప్పు రాజ్కుమార్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అనంతరెడ్డి, పైడ రవి, రాజన్న తదితరులున్నారు.