పెద్దపల్లి/పెద్దపల్లిటౌన్ నవంబర్ 26: వారంటీలేని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను నమ్మవద్దని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. తొమ్మిదన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. బంగారు బాతులాంటి బీఆర్ఎస్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదన్నారు. మోసపోతే గోసపడతామని చెప్పారు. ఆదివారం పెద్దపల్లిలోని 2, 3, 4, 5, 11, 18 వార్డుల్లో రాష్ట్ర సివిల్ సప్లయూస్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్తో కలిసి ఎమ్మెల్యే దాసరి రోడ్షో నిర్వహించారు. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అనంతరం మాట్లాడుతూ కేసీఆర్ స్థిరమైన పాలన, సుస్థిర అభివృద్ధి సాధ్యమన్నారు. అ న్నిరంగాల్లో తెలంగాణను దేశానికే దిక్సూచిగా నిలిపిన ఘనత ఆయనకే దక్కిందని కొనియాడారు.
ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి చరిత్ర మీకందరికీ తెలుసన్నారు. గతంలో ఆయనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పేదల సంక్షేమాన్ని విస్మరించారని విమర్శించారు. ఇప్పుడు తప్పుడు వా గ్ధానాలతో ముందుకు వచ్చి ప్రజలను గోల్మా ల్ చేసేందుకు యత్నిస్తున్నాడని ఆరోపించా రు. ఆయన తీరు కన్నతల్లికి అన్నం పెట్టనోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడన్నట్లున్నదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అచ్చేది లేదు..ఆయన గెలిచేది లేదన్నారు. గతంలో తాగునీటి కోసం మ హిళలు కంచెరబావివద్ద బార్లు తీరే దుస్థితి ఉండేదన్నారు. తాను ఇక్కడి ప్రజల తాగునీటి గోస తీర్చానాని చెప్పారు. ప్రస్తుతం ఇంటింటికీ శుద్ధ జలం అందిస్తున్నామన్నారు. అలాగే పెద్దపల్లిని జిల్లాగా ఏర్పాటు చేయించి పాలనను చేరువచేశానని చెప్పారు. అలాగే అన్ని హంగులతో సమీకృత కలెక్టరేట్ను నిర్మించుకున్నామన్నారు.
పెద్దపల్లిలో ప్రధాన రహదారులన్నీ నాలుగులేన్ల తారు రో డ్లుగా మారాయని, ఎల్లమ్మ గుండమ్మ చెరువును మినీ ట్యాంక్ మార్చి, సకల సౌకర్యాలు, అదునిక హంగులతో చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్స్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశామని, బోటింగ్ సౌకర్యం క ల్పించామని, అన్నింటికీ మించి ఎల్లమ్మగండమ్మ చెరువులో ఏడాది పొడువున నీళ్లుండటంతో భూ గర్భ జలాలు పెరిగాయనే విషయాన్ని మరిచిపోరాదన్నారు. పెద్దపల్లి జిల్లా సహజ వనరుల ఖిల్లా ని, పెద్దపల్లి జిల్లాకు ఒక వైపు గోదావరి నది, మరో వైపు మానేరు నదులు ఉన్నాయని, కానీ సమైక్య పాలనలో నిర్జీవంగా ఉన్నాయని, బీఆర్ఎస్ పాలనలో సజీవ నదులుగా మారాయన్నారు.
తనను మళ్లీ గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దాసరి మమతారెడ్డి, వైస్ చైర్ పర్సన్ సుల్తానామొబిన్, సీనియర్ నేతలు సత్యనారాయణరెడ్డి, వేములు రామ్మూర్తి, ఏఎంసీ చైర్మన్ జడల సురేందర్, పెద్దపల్లి కౌన్సిలర్లు శ్రీనివాస్, పస్తం హన్మంతు, లైశెట్టి భిక్షపతి, గాదె మాధవి, పూదరి చంద్రశేఖ ర్, పైడ పద్మరవి, పట్టణధ్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్, నాయకులు శ్రీధర్, వెంకటేశ్, వైద శ్రీనివాస్, పోసాని శ్రీనివా స్ యాదవ్, ప్రశాంత్, ఖదీర్ఖాన్ పాల్గొన్నారు.
పెద్దపల్లి 3వ వార్డుకి చెందిన బీజేపీ పట్టణ కార్యదర్శి రావుల జీవన్ ప్రకాష్ రెడ్డి, తన అనుచరులు వంశీ కృష్ణ, రాంబాబు, ఓదెలు, నాగరాజు, సాత్విక్, రమేశ్, మనోజ్, తరుణ్, వంశీ, అజయ్, సాయి, సంపత్, రాజు, అనిల్, రంజిత్ రెడ్డి, సంపత్, శీను, సాయి కృష్ణ, సతీష్, హరీష్, కుమారస్వామి, శివ, రవి, నవీన్, జితేందర్ రెడ్డి, శ్రీకాంత్, సతీష్, కళ్యాణ్, రిత్విక్, భరత్ కుమార్, జూలపెల్లి మండలం పెద్దాపూర్ గ్రామానికి చెం దిన జిల్లా స్వర్ణకార సంఘం ఉపాధ్యక్షుడు ఉప్పు ల నరసింహాచారి, కుందూరు శాంతన్ రెడ్డి, మిల్ల ర్ యూనియన్ అధ్యక్షుడు మనుమాండ్ల నాంప ల్లి,
ఓదెల మండలం ఉప్పరపల్లి మాజీ సర్పంచ్ పెద్ద స్వామి, యాదవ సంఘం ప్రెసిడెంట్ చేగొం డ శ్రీనివాస్ యాదవ్, సుల్తానాబాద్ మండలం సుద్దాల నుంచి బీఎస్పీ మాజీ జిల్లా అధ్యక్షుడు కల్వల శ్రీనివాస్, కల్వల అన్వేష్, కల్వల శ్రీనివా స్, రాజేంద్రప్రసాద్, సుగుణాకర్, శ్రీధర్, అనిల్ అరవింద్, సుజిత్, దిలీఫ్తో పాటు పలువురు బీఆర్ఎస్లో చేరారు. ఇక్కడ సర్పంచ్ కాసర్ల అం జలి అనంతరెడ్డి, ఎంపీటీసీ నిర్మల ఓదెలు, మాజీ ఎంపీటీసీ సంపత్, మాజీ సర్పంచ్ న్యాతరి రా జయ్య, బాలసాని శ్రీనివాస్, రంగు రవికుమార్, రంగు సదయ్య , తిరుపతి, మల్లయ్య ఉన్నారు.