వేములవాడ, జూలై 27: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు సూచించారు. వేములవాడలో భారీ వర్షంతో రహదారులు తెగిపోగా, మూలవాకు భారీగా వరద ప్రవాహం రావడంతో ఆయన పలు కాలనీల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి మాట్లాడారు. భారీ వర్షాలు మరో రెండు రోజులపాటు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ఎప్పటికప్పుడు సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నీట మునిగిన కాలనీల ప్రజలకు తక్షణమే సహాయ సహకారాలు అందించాలని సూచించారు. జరిగిన నష్టాన్ని అంచనా వేసి మంత్రి కేటీఆర్కు అందజేసి తగిన సహాయాన్ని కోరుతామని హామీ ఇచ్చారు. 30 ఏండ్ల తర్వాత మూలవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నందున పరీవాహక ప్రాంతాల్లో ఎలాంటి నష్టం వాటిల్లకుండా పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.