వేములవాడ, జనవరి 3: రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న సంక్షేమ పథకాల కోసం అర్హులైన ప్రతి ఒకరూ దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచించారు. వేములవాడ పట్టణంలోని 17,19, 20వ వార్డుల్లో ప్రజా పాలన సభలకు ఆయన హాజరై మాట్లాడారు.
సంక్షేమ పథకాలకు ప్రజలు నేరుగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అన్వేశ్, కౌన్సిలర్లు చింతపంటి దివ్య, కుమ్మరి శిరీష, బింగి మహేశ్ , నాయకులు వంగల శ్రీనివాస్, కుమ్మరి శ్రీనివాస్, చిలుక రమేశ్ , కూరగాయల కొమురయ్య, సూగూరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
రుద్రంగి, జనవరి 3: కాంగ్రెస్ ప్రభుత్వం హామీ మేరకు ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని, అర్హులందరూ ప్రతి పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. రుద్రంగి మండల కేంద్రంలో బుధవారం ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులతో కలిసి ప్రజాపాలన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరు గ్యారంటీలకు గ్రామస్తుల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చిన ఆరు రోజుల్లోనే ఆర్టీసీ ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాలు అమలు చేశామని తెలిపారు. ఎలాంటి అవకతవకలు లేకుండా 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. ఆరు గ్యారెంటీలపై ప్రజలకు అవగాహన కల్పించారు. పార్టీలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రజాపాలనలో 3070 దరఖాస్తులు స్వీకరించినట్లు ఎంపీడీవో శంకర్ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ గంగం స్వరూపారాణి, జడ్పీటీసీ గట్ల మీనయ్య, సెస్ డైరెక్టర్ గంగారాం, సర్పంచ్ ప్రభలత, ఎంపీటీసీ లావణ్య, తహసీల్దార్ శ్రీలత, ఎంపీడీవో శంకర్, ఎంపీవో సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.