వేములవాడ, జనవరి11: ప్రజా ఆరోగ్యానికి ప్రభు త్వం పెద్దపీట వేస్తున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం వేములవాడ ఏరియా దవాఖాన సందర్శించి, ప్రతి వార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షల వరకు పెంచిందని గుర్తు చేశారు. సేవలు అందించడంలో వైద్యు లు ముఖ్యపాత్ర పోషించాలని సూచించారు. ఇక్కడ సూపరింటెండెంట్ మహేశ్రావు, వైద్యులు ఉన్నారు.
వేములవాడ రాజన్న ఆలయ అధికారులతో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గురువారం ఆలయ చైర్మన్ సమావేశ మందిరంలో ఈవో కృష్ణప్రసాద్తో కలిసి మాట్లాడారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాట్లపై అధికారులను ఆరా తీశారు. సమ్మక- సారలమ్మ జాతరకు ముందు స్వామివారిని దర్శించుకునే ఆనవాయితీతో భక్తులు భారీగా తరలి వచ్చే అవకాశమున్నందున ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పారు. భక్తులు రద్దీగా ఉండే ఆది, సోమ, శుక్రవారాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఈఈ రాజేశ్, ఆలయ స్థానాచార్యుడు భీమశంకర్, ఏఈవోలు, డీఈలు, పర్యవేక్షకులు, ఏఈలు ఉన్నారు.
వేములవాడ రూరల్, జనవరి 11: స్వామి వివేకానంద ఆశయాలను యువత కొనసాగించాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం అగ్రహారం శ్రీ కన్వెన్షన్లో నరేన్ ఫౌండేషన్, హిమాన్షి పిల్లల దవాఖాన సంయుక్తంగా నిర్వహించిన జాతీయ యువజన దినోత్సవానికి హాజరై మాట్లాడారు. వ్యాసరచన, ఉపన్యాస పోటీల విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ ప్రసాద్, నరేన్ ఫౌండేషన్ చైర్మన్, హిమాన్షి చిల్డ్డ్రెన్స్ హాస్పిటల్ ఎండీ సురేంద్రబాబు, విద్యార్థులు పాల్గొన్నారు.