Minister Ponnam Prabhakar | వేములవాడ, మార్చి 27: వేములవాడలోని భీమేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు శుక్రవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజన్న సన్నిధిలో జరిగే సీతారాముల కల్యాణానికి ఆయన కుటుంబ సమేతంగా హాజరయ్యారు. అంతకుముందు భీమేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మంత్రి దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆయన వెంట ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమ అగ్రవాల్, రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బిగితే, ఈవో రమాదేవి, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఏఎంసీ చైర్మన్ రాజు తదితరులు ఉన్నారు.