వీధి వ్యాపారులు, మహిళా సంఘాల విభాగంలో మంచి పనితీరు కనబర్చినందుకు కరీంనగర్ కార్పొరేషన్కు ఉత్తమ సంస్థగా పురస్కారం లభించింది. ఈ మేరకు శుక్రవారం మంత్రి కేటీఆర్ హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో కమిషనర్ సేవా ఇస్లావత్కు పురస్కారం అందజేశారు.
అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పారిశుధ్య కార్మికుల పనితీరులో కరీంనగర్లో పనిచేస్తున్న పీ సంతోషిని ఉత్తమ కార్మికురాలిగా ఎంపికవగా, మంత్రి కేటీఆర్ రూ.5016 నగదు బహుమతితో పాటు పట్టుచీర, ప్రశంసా పత్రం, షీల్డ్ను అందజేశారు.
– కార్పొరేషన్, జూన్ 16