గోదావరిఖని, సెప్టెంబర్ 24: రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తన పుట్టిన రోజును పురస్కరించుకొని ఆదివారం హైదరాబాద్ ప్రగతి భవన్ రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ కలిసి ఆశ్వీరాదం తీసుకున్నారు. రామగుండం కార్పొరేషన్ రూ. 50 కోట్లు విడుదల చేయాలని కోరగా సానుకూలంగా స్పందించారని చెప్పారు.
అక్టోబర్ 1న రామగుండం పర్యటనలో మంత్రి ఐటీ అండ్ ఇండస్ట్రీయల్ పార్క్, క్రుజి కుమ్మి భూముల పట్టాల పంపిణీ, రామగుండం కార్పొరేషన్ రూ. 100 కోట్ల అభివృద్ధి పనులకు ఫౌండేషన్ వేయాలని మంత్రిని కోరానని ఎమ్మెల్యే వెల్లడించారు.