మనోహరన్నను గెలిపించాలె మీ ఎమ్మెల్యే బ్రహ్మాండంగా పనిజేసే నాయకుడు. ఆయనకు భగవంతుడు వ్యాపారాలు, నాలుగు పైసలు ఇచ్చిండు. పది మందికి ఖర్చు పెడుతడు కానీ, పది మందిని ఆగం చేయడు. ఆయన ఎప్పుడు సీఎం దగ్గరికి వచ్చినా.. మమల్ని కలిసినా.. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే తప్ప వ్యక్తిగత పనులు అడగడు. అలాంటి వ్యక్తిని మీరు గెలిపించుకుంటే మరింత అభివృద్ధి అయితది. ఓటేసే ముందు కులం, మతం ఫీలింగ్లోకి వెళ్లి ఆగం కావద్దు. బాగా ఆలోచించి వేయాలి. ఢిల్లీ ఓడు మన వేలితోనే మన కంటిని పొడిచే కుట్ర జేస్తున్నడు. ఆళ్లు సచ్చుడు కాదు.. వాళ్లకు ఓటేస్తే మనం జస్తం. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. బీఆర్ఎస్కే ఓటేయాలి. ఎక్కడోళ్లు అక్కడ జెప్పాలే.. మనోహరన్నను గెలిపించాలె.
– మంత్రి కేటీఆర్
పెద్దపల్లి, నవంబర్ 27(నమస్తే తెలంగాణ): ‘పెద్దపల్లిలో దమ్ము చూపాలె.. దుమ్ము లేపాలె. 30వ తారీఖున ఓట్లు. మూడో నెంబర్ కారు గుర్తు. నియోజకవర్గ ప్రజలు అద్భుతంగా తీర్పునివ్వాలె. ఇక్కడ మనోహర్రెడ్డి తప్ప ఏ సన్నాసి గెలిసినా పనులు కావు. ఇక్కడ గెలిచేది మనోహరన్నే. అక్కడ సీఎం అయ్యేది కేసీఆరే’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ను నమ్మితే పథకాలు ఆగిపోతామని, బతుకులు ఆగమవుతాయని హెచ్చరించారు. కులం, మతం ఫీలింగ్తో ఆగమై ఓటు వేయద్దని, కండ్లముందున్న అభివృద్ధిని చూసి ఓటు వేయాలని సూచించారు. ఆలోచించి ఓటు వేస్తే మన బతుకులు బాగుపడుతాయని చెప్పారు. పెద్దపల్లి నియోజకవర్గం సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పూసాల ఎక్స్రోడ్డులో సోమవారం ఉదయం 11 గంటల తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి ఆధ్వర్యంలో రోడ్షో నిర్వహించారు. రామన్న ముఖ్య అతిథిగా హాజరై, ప్రసంగించారు.
పదేండ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని వివరిస్తూనే.. కాంగ్రెస్ తీరును ఎండగట్టారు. యాభై ఐదేండ్లు ఏ పార్టీ అయితే మనల్ని నాశనం చేసిందో.. మనల్ని ఏ హస్తమైతే భస్మాసుర హస్తం లెక్క మనల్ని కాల్చి చంపిందో.. మళ్లీ వాళ్లొస్తే మన జీవితాలు నాశనమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్ల ఆరు గ్యారంటీలు నమ్మవద్దని, ఆర్నేళ్లకో ముఖ్యమంత్రి అనేదే నమ్మాలన్నారు. పొరపాటున నమ్మితే మళ్లీ ఆగమవుతామని హెచ్చరించారు. ఇక్కడి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ప్రజల కోసం కష్టపడే మంచి నాయకుడని, ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో చాలా చేశారని కొనియడారు. సుల్తానాబాద్, పెద్దపల్లిని మున్సిపాల్టీలుగా చేసుకోవడంతోపాటు ఎవరూ అనుకోని విధంగా పెద్దపల్లిని జిల్లాను చేశారని గుర్తు చేశారు. మరోసారి ఆయనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కొత్తగా కొలనూర్, గర్రెపల్లి, పెద్దపల్లి రూరల్ మండలాలను, ఎలిగేడులో పోలీస్స్టేషన్ను ఏర్పాటు చేసుకుందామన్నారు.
ఎవరైతే జీవో 58కి బదులు 59కి ఐప్లె చేసుకున్నారో.. అవి సరి చేసుకుందామని, మీకు ఫ్రీగా పట్టాలు ఇప్పిచ్చే బాధ్యత తనదేనని చెప్పారు. పెద్దపల్లి, సుల్తానాబాద్లో ఇంకా అభివృద్ధి జరగాలంటే.. గాడుదులకు గడ్డేసి, ఆవుల పాలు పితకొద్దని ఛలోక్తి విసిరారు. అట్లనే కాంగ్రెస్కు ఓటేసి పనులు కావాలంటే.. పనులు కావని విమర్శించారు. అందుకే మనోహరన్న ఉన్నడని, కేసీఆర్ ఉన్నడని, కారు గుర్తుకు ఓటేసి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, పెద్దపల్లి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు రవీందర్ సింగ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రఘువీర్ సింగ్, ఆర్బీఎస్ జిల్లా అధ్యక్షుడు పాల రామారావు, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ముత్యం సునీత రమేశ్గౌడ్, ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బుర్ర మౌనికాశ్రీనివాస్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్లా మనోహర్రెడ్డి, గంటా రాములు, సీ సత్యనారాయణరెడ్డి, మండల కన్వీనర్ పురం ప్రేంచందర్రావు, పట్టణ అధ్యక్షుడు పారుపల్లి గుణపతి తదితరులు పాల్గొన్నారు.
ఇయాళ చాలా మంది సెంటిమెంట్ పండిస్తున్నరు. అన్నా.. అవ్వా.. తమ్మీ.. అక్కా.. నేను మీ సుట్ట పోన్నంటున్నరు. లేని ప్రేమలు ఒలకబోస్తున్నరు. కానీ పోటీ వ్యక్తుల మధ్య కాదు, పార్టీల మధ్య. ఈ విషయాన్ని గుర్తించాలి. అందుకే ఏ పార్టీ ఎటు నిలబడుతున్నదో ఆలోచించాలి. రైతు బంధు ఇచ్చిన బీఆర్ఎస్ కావాల్నా.. రాబందు, రైతుబంధును ఆపిన కాంగ్రెస్ కావాల్నా.. 24గంటలల కరెంటు కావాల్నా.. 3గంటలు కావాల్నా.. మీరే ఆలోచించాలి. ఆ పార్టీ అధికారంలోకి రాకముందే రైతుబంధును
– మంత్రి కేటీఆర్ జనవరిలో కొత్త రేషన్ కార్డులు
బీఆర్ఎస్ గెలిస్తే.. కోడళ్లకు కొత్త పథకం ‘సౌభాగ్య లక్ష్మి’ తీసుకొస్తున్నం. ప్రతి ఇంటి కోడలికి డిసెంబర్ తర్వాత నెలకు 3వేలు ఇస్తం. అత్తలు, అమ్మలకు ఆసరా కింద ఇచ్చే పింఛన్లను 5వేల వరకు చేస్తం. 400లకే సిలిండర్ ఇస్తం. జనవరిలో కొత్త రేషన్ కార్డులు ఇస్తం. తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇస్తం. ‘కేసీఆర్ బీమా.. ప్రతీ ఇంటికి ధీమా’ను అమలు చేస్తం. అసైన్డ్ భూములు ఉన్నవారికి డిసెంబర్ 3తర్వాత పూర్తి యాజమాన్య హక్కు పత్రాలను అందిస్తం.
– మంత్రి కేటీఆర్