వెల్గటూర్, డిసెంబర్ 1: శాతవాహనుల మొట్టమొదటి రాజధాని కోటిలింగాలకు కొత్త శోభ తెస్తామని, చుట్టూ ఉన్న ప్రాంతాలను కలుపుకొని టూరిస్టు స్పాట్గా మారుస్తామని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. చుట్టు పక్కల ఉన్న స్తంభంపల్లి, పాశిగామ ప్రాంతాల్లో 2 నుంచి 5వ శతాబ్ద కాలంలో బౌద్ద మతం వర్ధిల్లినట్లు చరిత్ర కారులు చెబుతుండగా, అప్పటి ఆనవాళ్లు ఇప్పటికీ ఇక్కడ ఉండడంతో ఇదే ప్రాంతంలో 30 అడుగుల బౌద్ధ స్తూపం, 25 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు గురువారం మంత్రి కొప్పుల పాశిగామ శివారులో 1090 సర్వే నంబర్లోని స్థలాన్ని పరిశీలించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ, కోటిలింగాల కోటేశ్వర స్వామి పురాతన దేవాలయం, ఇథనాల్ ప్రాజెక్టు, హరిత హోటల్, ఎల్లంపల్లి ప్రాజెక్టు, బౌద్ధవనం లాంటి వాటితో ఈ ప్రాంతం పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కునమల్ల లక్ష్మి, ఏఎంసీ చైర్మన్ పత్తిపాక వెంకటేశ్, సర్పంచులు చల్లూరి రూపారాణి, బొప్ప తిరుపతి, బోడకుంటి రమేశ్, కొప్పుల సాగర్, టీఆర్ఎస్ అధ్యక్షుడు చల్లూరి రాంచందర్ గౌడ్, సింహాచలం జగన్, ఉపాధ్యక్షుడు గుండా జగదీశ్వర్గౌడ్, ప్రధాన కార్యదర్శి జుపాక కుమార్, నాయకులు బొడ్డు రామస్వామి, మూగల సత్యం, పెద్దూరి భరత్ కుమార్, దావుల లక్ష్మణ్, కుమ్మరి వెంకటేశ్, సప్ప రాజు, వెల్గటూర్ పట్టణాధ్యక్షుడు రంగు తిరుపతి గౌడ్, బందేల నర్సయ్య, గాజుల భానేశ్, కొప్పుల రవీందర్, తహసీల్దార్ ఉయ్యాల రమేశ్, ఆర్ఐ రాజేశ్వరి, సర్వేయర్ లక్ష్మణ్ పాల్గొన్నారు.