జగిత్యాల రూరల్, ఆగస్టు 7 : తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలలు అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలను ఆదివారం మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల, కోరుట్ల, చొప్పదండి ఎమ్మెల్యే లు డాక్టర్ సంజయ్ కుమార్, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, సుంకె రవిశంకర్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, కలెక్టర్ గుగులోతు రవితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తరగతి గదులను, ప్రొజెక్టర్లను పరిశీలించారు. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ 268 రెసిడెన్షియల్ స్కూళ్లను అప్గ్రేడ్ చేస్తూ జూనియర్ కళాశాలలుగా మార్చారన్నారు. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేశామన్నారు. ఏటా ఒక సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో లక్షా 30 వేల మంది, 4 గురుకుల విభాగాల్లో 5 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తారని తెలిపారు.
కార్పొరేట్కు దీటుగా విద్య అందిస్తున్నామని తెలిపారు. ఒకొక విద్యార్థిపై దాదాపు లక్ష వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో మంచి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను మంత్రి అభినందించారు. రాబోయే సంవత్సరంలో అందరూ వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని, పిల్లలు, టీచర్లకు నిర్దేశం చేశారు. గతంలో స్టడీ సరిళ్లు పరిమితంగా ఉండేవని, కానీ నేడు 132 స్టడీ సరిళ్లు ఏర్పాటు కాబోతున్నాయన్నారు. చదువులో వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు దేశంలో ఎకడా లేని విధంగా ఏర్పాటు చేశారన్నారు. మహిళ డిగ్రీ కళాశాల మంజూరు చేశారని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు కళాశాలను ప్రారంభించడానికి వచ్చిన మంత్రి కొప్పుల ఈశ్వర్కు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎస్సీ , బీసీ సంక్షేమ శాఖ అధికారులు రాజ్ కుమార్, సాయిబాబా, కౌన్సిలర్ మల్లవ్వ తిరుమలయ్య, ఎఆర్సీవో సూర్య ప్రకాష్ రావు, ప్రిన్సిపల్ సునిత, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
అంతర్గాం, ఆగస్టు 7: రైతు సంక్షేమమే ప్రభు త్వ ధ్యేయమని మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. మండలంలోని సోమనపల్లిలో నూతన రైతు వేదిక భవనాన్ని, బ్రాహ్మణపల్లిలో మండల ప్రజా పరిషత్ కార్యాలయ భవనాన్ని ఆదివారం వారు ప్రారంభించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతుల కొరకు నిరంతరం కృషి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. రైతులకు వ్యవసాయ రంగం పై మరింత పరిజ్ఞానం పెంచేందుకు రైతు వేదికలు ఎంతో దోహద పడుతాయన్నారు. కార్యక్రమాల్లో ఎంపీపీ దుర్గం విజయ, జడ్పీటీసీ ఆముల నారాయణ, వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మీమహేందర్, సర్పంచులు ధరణి రాజేశ్, బండారి ప్రవీణ్, కే స్వప్న సతీశ్, బాదరవేని స్వామి, ధర్మాజీ కృష్ణ, తుంగపిండి సతీశ్, రవీందర్, ఎంపీటీసీ శరణ్య మధుకర్, మస్కం శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లం రాజన్న, గౌస్పాషా, తిరుపతి నాయక్, శ్రీనివాస రెడ్డి, తిరుపతి, ఆవుల గోపాల్ ఉన్నారు.