జగిత్యాల టౌన్, మే 16: ధాన్యం చివరి గింజ వరకు పూర్తి మ ద్దతు ధరకు కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం ధాన్యం కొనుగోలు ప్రక్రియపై జగిత్యాల సమీకృత జిల్లా కలెక్టరేట్లోని స్టేట్ చాంబర్లో ఎమ్మెల్యేలు విద్యాసాగర్రావు, సంజయ్కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్రావు, జగిత్యాల కలెక్టర్ యాస్మిన్ భాషతో కలిసి రివ్యూ నిర్వహించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించి వివరాలను కలెక్టర్ మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. అకాల వర్షాలతో ఏర్పడ సమస్యలను సీఎం కేసీఆర్కు దృష్టికి తీసుకెళ్లామని, ఆయన ఆదేశాలతో రైతులకు ఇబ్బందులుకలగకుండా తక్షణ చర్యలు తీసుకున్నామని చెప్పారు.
ముఖ్యంగా పంట నష్టపోయిన వారికి ఎకరానికి రూ.10 వేల చొప్పున మొదటి విడత సాయం మంజూరు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో 2014తో పోలిస్తే రాష్ట్రంలో సాగు విస్తీర్ణం చాలా పెరిగిందన్నా రు. ఒక్క జగిత్యాల జిల్లాలోనే గతేడాది 74,929 హెక్టార్లలో సాగు జరుగగా, అది ఈ ఏడాది 1,12,040 హెక్టార్లకు పెరిగిందని వివరించారు. ఈ మేరకు జిల్లాలో 410 కొనుగోలు కేం ద్రాలు ఏర్పాటు చేసి 4.56లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రణాళికలు తయారు చేసినట్లు చెప్పారు. జిల్లాలో ఇ ప్పటి వరకు 1,59,626 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నామన్నారు. రైస్మిల్లర్ల వద్ద స్థలం సమస్య ఉండడం, క్షేత్ర స్థాయిలో కొన్ని ఇబ్బందులతో మిల్లుల వద్ద ధాన్యం దిగుబడిలో కొంత ఆలస్యం జరిగిందని, ఆ సమస్యల పరిష్కారానికి వెంటనే చర్య లు తీసుకున్నట్లు చెప్పారు. వద్ద 24 గంటల్లో లారీల నుంచి ధాన్యం దిగుబడి చేసుకునేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, కలెక్టర్, అధికారులు ప్రతి రోజు పర్యవేక్షిస్తారన్నారు.
కొనుగోలు చేసిన ధాన్యంలో మిల్లుల వద్ద తూకంలో కోత పెడితే చర్యలు తప్పవన్నారు. రైతుల విషయంలో ప్రతిపక్షాలు అనవసరపు రాజకీయం చేస్తున్నాయని, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో పంట సాగు విస్తీర్ణం తక్కువగా ఉన్నప్పటికీ సమయానికి ఎరువులు, విత్తనాలు ఇవ్వలేకపోయారని, కరెం టు కోసం రైతులు అనేక ఇబ్బందులు పడ్డ విషయం అందరికీ తెలుసునని మంత్రి గుర్తు చేశారు. దేశంలో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తె లంగాణ మాత్రమేనన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కఠినంగా వ్యవహరిస్తామని, ప్రతి మండలానికి ఒక జి ల్లా స్థాయి అధికారిని నియమించి క్షేత్ర స్థాయి సమస్యలను ప రిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.