ధర్మపురి, జూన్12: రాష్ట్రంలో శాంతి, భద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని గుర్తించిన సీఎం కేసీఆర్, పోలీసుశాఖకు పెద్దపీట వేశారని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నా రు. రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ధర్మపురిలో పోలీస్శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రన్ కార్యమ్రానికి మంత్రి హాజరయ్యారు. పట్టణంలోని నంది చౌక్ వద్ద ఏర్పా టు చేసిన వేదికపై నుంచి మంత్రి ఈశ్వర్ మాట్లాడారు. గతంలో ఏ ప్రభుత్వంలో లేనివిధంగా స్వరాష్ట్రంలో పోలీసుశాఖకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యంతోపాటు ప్రతి వార్షిక బడ్జెట్లో ప్రత్యే క నిధులు కేటాయిస్తూ ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. సీఎం ఆశయం, ఆలోచనలకు అనుగుణంగా పోలీసులు కూడా నడుచుకుం టూ మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని వివరించారు. ప్రజాభద్రత నేపథ్యంలో ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తూ ముందుకు సాగుతున్నారన్నారు. నేరగాళ్ల ఆటకట్టిస్తూ, నేరాల సంఖ్యను తగ్గిస్తూ, రాష్ట్ర పోలీసులు అమలు చేస్తున్న కార్యక్రమాలకు ఇతర రాష్ర్టాల పోలీసులు సైతం ఆకర్షితులవుతున్నారని చెప్పారు. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన షీటీంలను వేర్వేరు పేర్లతో ఇతర రాష్ర్టాలో అమలు చేస్తున్నారంటేనే మన ప్రభుత్వం పనితీరును తెలియజేస్తున్నదని కొనియాడారు. సైబర్ ల్యాబ్లు ఏర్పాటు చేసి సైబర్ నేరాలకు చెక్ పెడుతున్నారన్న మంత్రి ఈశ్వర్, ఈ సందర్భంగా పోలీసులను అభినందిస్తున్నట్లు తెలిపారు.
జెండా ఊపి.. కార్యక్రమాన్ని ప్రారంభించి..
ధర్మపురి పట్టణంలోని నంది చౌక్ వద్ద మంత్రి ఈశ్వర్ పచ్చజెండా ఊపి ‘తెలంగాణ రన్’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నంది చౌక్ నుంచి గాంధీ, పోలీస్స్టేషన్, పటేల్ విగ్ర హం, వివేకానంద విగ్రహం, అంబేద్కర్ విగ్ర హం నుంచి పుష్కర పైలాన్ దాకా సాగిన రన్, అక్కడి నుంచి మళ్లీ నంది చౌక్కు చేరుకుంది. దారి వెంట కూడళ్ల వద్ద కార్యక్రమంలో పా ల్గొన్న వారి కోసం పోలీస్శాఖ ఆధ్వర్యంలో పైలాన్ వద్ద అల్పాహారం ఏర్పాటు చేశారు. ఇక్క డ కలెక్టర్ యాస్మిన్ భాషా, అడిషనల్ కలెక్టర్ మంద మకరందు, ఎస్పీ భాస్కర్, డీఎస్పీ ప్రకా శ్, సీఐ బిల్లా కోటేశ్వర్, డీసీఎమ్మెస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, జడ్పీటీసీ బాదినేని రాజేందర్, బత్తిని అరుణ, సుధారాణి, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తె మ్మ, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, ఏఎంసీ వైస్ చైర్మన్ అక్కనపల్లి సునీల్కుమార్, ఎస్ఐలు కిరణ్కుమార్, సందీప్, శ్వేత, దత్తాద్రి, ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు, మహిళాసంఘాల మ హిళలు, ఆరు మండలాల యువజన సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రజల సహకారం అవసరం..
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తోంది. తెలంగాణలో మహిళల భద్రతకు ఢోకాలేదు. తెలంగాణ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నిర్ణయాలతో నేరాల సంఖ్య తగ్గింది. ప్రభుత్వ కార్యక్రమాల విజయవంతానికి ప్రజల సహకారం ఎంతో అవసరం. తెలంగాణ రన్కు సంబంధించి జగిత్యాల, కోరుట్ల కంటే ధర్మపురిలో ఏర్పాట్లు బాగాచేసిన పోలీస్ సిబ్బందికి అభినందనలు. వేడుకల్లో ధర్మపురి యువత, ముఖ్యంగా మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం హర్షనీయం.
– యాస్మిన్ బాషా, జగిత్యాల కలెక్టర్
ప్రజల భద్రతే ధ్యేయం
సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా ప్ర జా భద్రతే ధ్యేయంగా తెలంగాణ పోలీస్ పనిచేస్తోంది. శాంతిభద్రతల పరిరక్షణకు అనునిత్యం శ్రమిస్తోంది. ప్రభుత్వ ప్రత్యేక దృష్టి, ప్రాధాన్యంతో ఒకప్పటికీ ఇప్పటికీ పోలీసు వ్యవస్థలో ఎంతో మార్పువచ్చింది. ధర్మపురి తెలంగాణ రన్లో యువత, మహిళలు అధికంగా పాల్గొనడం సంతోషంగా ఉంది. ప్రజలను భాగస్వాములను చేసేందుకు కృషి చేసిన పోలీసులకు అభినందనలు.
– భాస్కర్, జగిత్యాల ఎస్పీ