ధర్మపురి/పెగడపల్లి/ మల్యాల, ఫిబ్రవరి 25: అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్నదని సీఎం కేసీఆర్ నాయకత్వంలో దినదినాభివృద్ధి చెందుతున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. సమైక్య పాలనలో ధర్మపురి అన్నింటా వెనుకబడి పోయిందని, స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు హయాంలోనే ప్రగతిలో దూసుకెళ్తున్నదని చెప్పారు. చేపట్టిన పనులు పూర్తయితే ధర్మపురి క్షేత్ర రూపురేఖలు మారిపోనున్నాయని చెప్పారు. ధర్మపురిలో శనివారం రూ. 5.92కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు.
మొదట రూ.2కోట్లతో కమలాపూర్ బోలిచెరువు ఫిల్టర్బెడ్ నిర్మాణాన్ని ప్రారంభించారు. రూ.2కోట్లతో దళిత విజ్ఞాన్ భవన్, రూ.1.40కోట్లతో కోరండ్లపల్లి నుంచి నక్కలపేట రహదారి దాకా బీటీ రోడ్డు, రూ.17లక్షలతో జూనియర్ కళాశాల ప్రహరీ, రూ.10లక్షలతో సుతారి సంఘ భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అలాగే పెగడపల్లి మండల కేంద్రం నుంచి మల్యాల మం డల కేంద్రం దాకా రూ.20 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు, నర్సింహునిపేటలో రూ.20 లక్షలతో నిర్మించే నూతన జీపీ భవన నిర్మాణ పనులకు జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, మల్యాల వద్ద ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఆయాచోట్ల మాట్లాడారు. పట్టణాలకు దీటుగా పల్లెల అభివృద్ధికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తూ పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నారని చెప్పారు. అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని, దీనికి తోడు కుల సంఘాలకు భవనాలను నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. ధర్మపురి క్షేత్రానికి తలాపున గోదావరి పారుతున్నా ఒకప్పుడు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఉండేవని, ప్రభుత్వం మిషన్ భగీరథ కింద ఇంటింటికీ స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నదని చెప్పారు.
మత్స్య రంగంలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందనీ, మత్స్యకారులు జీవితాల్లో వెలుగులు నిండాయని మంత్రి ఈశ్వర్ పేర్కొన్నారు. ధర్మపురి క్షేత్రంలోని గోదావరి ఒడ్డున రూ.25లక్షలతో గంగమ్మతల్లి గుడి నిర్మాణ పనులకు భూమి పూజ చేసి, మాట్లాడారు. మత్య్సకారులు కోరిక మేరకు గంగమ్మతల్లి గుడిని నిర్మిస్తున్నామని, ఐదు నెలల్లో పూర్తి చేసి బ్రాహ్మండంగా ప్రారంభించుకుందామన్నారు. మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉందని, ఉచిత చేప, రొయ్య పిల్లలు పంపిణీ చేస్తున్నదని, సబ్సిడీపై వలలు, మార్కెటింగ్ కోసం లగేజీ ఆటోలు, మోపెడ్లు ఇస్తున్నదని వివరించారు.
మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. ఇక్కడ డీసీఎమ్మెస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, ధర్మపురి, పెగడపల్లి ఎంపీపీలు ఎడ్ల చిట్టిబాబు, శోభ, జడ్పీటీసీలు బత్తిని అరుణ, రాజేందర్రావు, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్కుమార్, ఏఎంసీ వైస్ చైర్మన్ అక్కనపల్లి సునీల్కుమార్, కౌన్సిలర్లు పురాణపు కిరణ్మయి-సాంబమూర్తి, బండారి అశోక్, సయ్యద్ యూనుస్, కార్తీక్, గరిగె అరుణ, సర్పంచులు శ్రీనివాస్, బాబుస్వామి, లక్ష్మణ్, ఎంపీటీసీలు జమున-స్వామి, రజిత-రమణారకర్, విండో చైర్మన్లు రమణారావు, భాస్కర్రెడ్డి, వేణుగోపాల్, వైస్ ఎంపీపీ గంగాధర్, ఆర్బీఎస్ చైర్మన్ నరేందర్రెడ్డి, మార్కెట్ చైర్-పర్సన్ నిర్మల-మల్లారెడ్డి, వైస్ చైర్మన్ ఆంజనేయులు, నాయకులు చంద్రారెడ్డి, బండి వెంకన్న, పెద్ది రమేశ్, లక్ష్మీనారాయణ, విజయ్యాదవ్, కనకయ్య, పద్మ, సత్తయ్య, సంగి శేఖర్, సౌళ్ల నరేశ్, ఇనుగంటి వెంకటేశ్వర్రావ్, అనంతుల లక్ష్మణ్, చిలివేరి శ్యాంసుందర్, గడ్డం బాలరాజు, మత్స్యకార సంఘం నాయకులు గజ్జి మల్లేశ్, నర్ముల శంకర్, గరిగె గంగన్న ఉన్నారు.