ధర్మపురి, జూన్ 5: స్వరాష్ట్రంలో విద్యుత్ కోతలతో కమ్ముకున్న కారు చీకట్లను దూరం చేసి వెలుగులతో నింపామని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. విద్యుత్ సమస్యలను పూర్తిగా తొలగించి తెలంగాణ సమాజం గర్వంగా తలెగరేస్తున్నదని, కేవలం మూడేళ్ల కా లంలోనే మిగులు విద్యుత్ రాష్ట్రంగా నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ కోత లు లేని కరెంటుతో దేశానికే ఆదర్శంగా రాష్ట్రం కాంతులీనుతున్నదని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం పట్టణంలోని ఎస్హెచ్ గార్డెన్స్లో నిర్వహించిన విద్యుత్ విజయోత్సవ కార్యక్రమాన్ని మంత్రి ఈశ్వర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అంతకుముందు పట్టణంలోని నంది చౌక్ వద్ద నుంచి కార్యక్రమ స్థలానికి మంత్రి ఈశ్వర్ బైక్ ర్యాలీగా చేరుకున్నారు.
ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ, 60 ఏళ్ల పాలనలో ఏనాడూ చూడని 24గంటల విద్యుత్ను కేవలం రాష్ట్రం ఏర్పడ్డ ఆర్నెళ్లలోనే సీఎం కేసీఆర్ సాధించి చూపారన్నారు. ‘తెలంగాణ వస్తే ఏమవుతుంది. కరెంటు కరువవుతుంది. రాష్ట్రం అంధకారమవుతుంది’ అంటూ సమైక్య పాలకులు చేసిన విమర్శలను తిప్పికొట్టామన్నారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో నాడు రైతాంగానికి కేవలం 6గంటల విద్యుత్ సరాఫరా మాత్రమే ఉండేదని, అది కూడా రాత్రి పూట విడుతల వారీగా సరాఫరా చేసేవారన్నారు. రాత్రి పూట కరెంటు వల్ల రైతులు పొలాల వద్ద వెల్లి పాముకాటుకు గురై, విద్యుత్ ప్రమాదాల బా రిన పడి ఎందరో రైతులు ప్రాణాలు వదిలారని గుర్తుచేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక నేడు రైతాంగానికి నిరంతరం విద్యుత్ సరాఫరా చేస్తున్నామన్నారు. నాడు ఎస్సీ, ఎస్టీలకు కేవలం 50 యూనిట్ల వరకు మాత్రమే ఉచిత్ విద్యుత్ సరాఫరా ఉండేదని, నేడు ఎస్సీ, ఎస్టీలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నామన్నారు. నాడు నాయిబ్రాహ్మణులకు, దోభీ ఘాట్ మరియు రజక వృత్తిదారులకు ఎలాంటి సబ్సిడీలు లేవనీ, నేడు నాయిబ్రాహ్మణులకు, దో బీఘాట్ మరియు రజక వృత్తిదారులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నామన్నారు.
నాడు 1356 యూనిట్లు మాత్రమే రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం ఉండేడిదని, కానీ నేడు రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 2140 యూనిట్లు అన్నారు. ఇది దేశ సగటు కన్నా 71 శాతం అధికం అన్నారు. ఇదంతా సీఎం కేసీఆర్తోనే సాధ్యమైందన్నారు. కాంగ్రేస్, బీజేపీ నాయకులు వట్టి మాటలకే పరిమితమయ్యారే తప్ప ప్ర జలకు చేసిందేమీలేదని దుయ్యబట్టారు. ప్రజలకు ఏది అవసరమో గుర్తించలేక పోయారన్నారు. తెలంగాణ సర్కారు హయాంలో కేవలం ధర్మపురి నియోజకవర్గంలో 33/11కేవీ సబ్స్టేషన్లు 12 ఏర్పడ్డాయన్నారు. ఇన్ని మంచి పనులు చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని కోరారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తూ, ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్న రాజకీయ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. రైతుల ముసుగులో రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు. ఈనెల 3న జరిగిన తెలంగాణ రైతు దినోత్సవ కార్యక్రమం జరిగిన రోజున కాంగ్రెస్, బీజేపీకి చెందిన కొందరు రాజకీయ నాయకులు కావాలని క్యాంపు కార్యాలయం ముందు ధాన్యం పోయించారని, ఇది సబబు కాదన్నారు.
కమలాపూర్లో ఇప్పటి వరకు 20వేల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసిన ప్రభుత్వం ఒక్క రైతుకు చెందిన ధాన్యాన్ని మాత్రమే ఎందుకు కొనకుండా ఉంటుందని ఎదురు ప్రశ్నించారు. కల్లాల వద్ద పోయాల్సిన ధాన్యాన్ని కార్యాలయం ముందు రోడ్డుపై పోయడం అనేది రాజకీయం కాక మరేమిటన్నారు. రైతు ముసుగులో రాజకీయం చేయాలంటే చెల్లదన్నారు. అలాంటి వారిని రైతులే గుర్తించి తగిన బుద్ధిచెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మంద మకరంద్, కరీంనగర్ డీసీఎమ్మెస్ చైర్మన్ డా.ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, ఆయా మండలాల ఎంపీపీలు ఎడ్ల చిట్టిబాబు, కరుణశ్రీ, జడ్పీటీసీలు బత్తిని అరుణ, పద్మజ, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్కుమార్, మండల రైతుబంధు సమితి కన్వీనర్ సౌళ్ల భీమయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, ఏఎంసీ వైస్ చైర్మన్ అక్కనపల్లి సునీల్, మున్సిపల్ కమీషనర్ రమేశ్, ఎంపీడీఓ ప్రవీణ్, ఎస్ఈ సత్యనారాయణ, డీఈ రవీందర్, ఏడీఈలు సంధూర్శర్మ, వరుణ్, రాజాబ్రహ్మచారి, నగేశ్కుమార్, వెంకటేశ్వర్లు, అశోక్, శ్రీనివాస్, సమ్మయ్య తదితరులున్నారు.