ధర్మారం, జనవరి 1: నంది మేడారంలో నూతనంగా నిర్మించనున్న 30 పడకల దవాఖాన శంకుస్థాపన కోసం ఈ నెల 5న మంత్రి హరీశ్రావు వస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. ఆదివారం కరీంనగర్లో మంత్రి ఈశ్వర్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన ప్యాక్స్ చైర్మన్లు ముత్యాల బలరాంరెడ్డి, నోముల వెంకట్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్, సర్పంచులు, ఎంపీటీసీలతో కొప్పుల మాట్లాడారు.
ఇది వరకు అనుకున్న లక్ష్యం ప్రకారం మండలంలోని 29 గ్రామ పంచాయతీల నుంచి సుమారు 5 వేల మందిని తీసుకువచ్చి మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని ఆదేశించారు. పార్టీ నాయకులు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు సమష్టిగా బాధ్యతలు తీసుకొని ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూడాలని, పర్యటనను సక్సెస్ చేయాలని సూచించారు.