కమాన్చౌరస్తా, జూన్ 11 : గొప్ప గొప్ప కవులు, కళాకారులు సాహితీవేత్తలకు పుట్టినిల్లు కరీంనగర్ జిల్లా అని, జానపదానికి, ఉద్యమానికి పెట్టింది పేరు అని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆధ్వర్యంలో జిల్లా సాహితీ సంస్థల సమాఖ్య సమన్వయంతో కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన సాహిత్య దినోత్సవం కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారులు, సాహితీ వేత్తలు ముఖ్య భూమిక పోషించారన్నారు. అలాంటి కవులు, కళాకారులు, సాహితీవేత్తలను గౌరవించుకోవాలనే ఉద్దేశంతో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సాహితీ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని తెలిపారు.
కరీంనగర్ జిల్లా కళాకారులకు వేదిక అని, పీవీ నరసింహారావు, డాక్టర్ సీ నారాయణరెడ్డి, అలిశెట్టి ప్రభాకర్ పుట్టిన గడ్డ అని, ఉద్యమాలకు, జానపదాలకు వేదిక కరీంనగర్ జిల్లా అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా అని, గత ఐదు దశాబ్దాల సమైక్య పాలనలో ఈ ప్రాంత అభివృద్ధికి నాటి పాలకులు ఒక రూ పాయి కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. పకనే మానేరు జలాశయం ఉన్నా తాగునీటి కోసం ట్యాంకర్ల వద్ద యుద్ధాలు, గుంతల రోడ్లు, మా నీరు మాకే కావాలని ఎల్ఎండీ వద్ద ధర్నాలు చేసిన రోజులు గుర్తుకొస్తున్నాయని తెలిపారు. గతంలో నగరంలో రోడ్లు డ్రైనేజీలు లేక ఇబ్బందులు పడ్డ రోజులు ఇంకా జ్ఞాపకం ఉన్నాయని, కరీంనగర్ అభివృద్ధి కోసం నిధులు కావాలని నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని అడిగితే వెకిలిగా నవ్వారే తప్ప ఒక రూపాయి ఇవ్వలేదన్నారు.
కరీంనగర్ అభివృద్ధిలో చెయ్యి ఇచ్చారే తప్ప చేయూతనివ్వలేదన్నారు. ఇకడి సంపదను వారి ప్రాంతానికి తరలించి అభివృద్ధి చేసుకున్నారని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే మనసు వారికి రాలేదని విమర్శించారు. స్వ యంపాలనలో మారుమూల ప్రాంతాల్లో విద్యు త్ కాంతులు విరజిల్లుతున్నాయన్నారు. కరీంనగరాన్ని సుందరంగా తీర్చిదిద్దామని, సెంట్రల్ లైటింగ్తో రాత్రివేళ కరీంనగరం జిగేల్ మంటున్నదని, మన నీరు, మన బొగ్గు, మన నిధులు, మన సంపదతో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయన్నారు. సర్వమతాలకు వేదిక కరీంనగరం అని, అందరం కలిసి ప్రశాంత వాతావరణంలో జీవిస్తే కరీంనగరం మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని సూచించారు. మన బిడ్డల బంగారు భవిష్యత్ కోసం మాట్లాడుతున్నానని, ప్రపంచ స్థాయిలో కేబుల్ బ్రిడ్జి, మా నేర్ రివర్ ఫ్రంట్ను నిర్మిస్తున్నామని చెప్పారు.
గతంలో దుర్గంధాన్ని వేద జల్లిన మానేరు తీరం ఇప్పుడు పర్యాటక కేంద్రంగా మారిందన్నారు. కేబుల్ బ్రిడ్జిని ఈ నెల 21వ తేదీన ప్రారంభించనున్నట్లు, మానేరు రివర్ ఫ్రంట్ను ఆగస్టు 15న ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ఎంఆర్ఎఫ్ ప్రాజెక్ట్లో భాగంగా ప్రపంచంలోనే మూడోదైన బిగ్ ఓ పౌంటెయిన్ను నిర్మిస్తున్నామని, తెలంగాణ రాకపోతే ఈ అభివృద్ధి జరిగేదా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పాలన ఇలాగే కొనసాగాలని, దశాబ్ది ఉత్సవాలు సర్వ మతాల పండుగ అని పేర్కొన్నారు. కవులు, కళాకారు లు, సాహితీ వేత్తలకు ఒక వేదిక ఉండాలనే ఉద్దేశంతో భవన నిర్మాణం కోసం 5 గుం టల భూమిని కేటాయించామని తెలిపారు.
ఈ నెల 14వ తేదీన భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ పురోగతిలో కవులు, కళాకారులు, సాహితీవేత్తలు మీ వంతు పాత్ర పోషించాలని మంత్రి సూచించా రు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లాకు చెందిన 93 మందిర్ రచించిన కవితల సంకలనం ‘పదేండ్ల పండుగ’ పుస్తకావిషరణ చేశారు. 93 మంది కవులతో కవి సమ్మేళనం నిర్వహించి రూ. వె య్యి నగదు, శాలువాతో సత్కరించారు. అలాగే, కేంద్ర సాహిత్య అకాడమీ, జాతీయ స్థాయి పురసారాలు పొందిన 25 మంది సీనియర్ కవులను రూ.2వేల నగదు, శాలువాతో స తరించారు. ఇక్కడ కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎమ్మె ల్యేలు రసమయి బాలకిషన్, రవిశంకర్, మేయ ర్ వై సునీల్ రావు, అదనపు కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్ లాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, రాష్ట్ర పౌర సరఫరాల సం స్థ చైర్మన్ రవీందర్ సింగ్, సుడా చైర్మన్ జీవీఆర్, సాహితీ గౌతమీ అధ్యక్ష, కార్యదర్శులు నంది శ్రీ నివాస్ కొత్త అనీల్ కుమార్, సమన్వయ కర్త అ నంతాచార్య, తెలుగు ఉర్దూ కవులు ఉన్నారు.