నాటి పాలనలో కుదేలైన కులవృత్తులకు రాష్ట్ర ప్రభుత్వం జీవం పోస్తున్నది. బీసీల్లోని కులవృత్తులను నమ్ముకొని జీవిస్తున్న వారికి ప్రోత్సాహం అందిస్తున్నది. లక్ష చొప్పున సాయం అందిస్తూ.. కుటుంబాలకు ఆసరా అవుతున్నది. వృత్తిని పెంపొందుకునేందుకు, ముడి సరుకు తెచ్చుకునేందుకు ఈ నగదు ఉపయోగపడుతుండగా, పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగనున్నది. వచ్చిన దరఖాస్తులను వచ్చినే యంత్రాంగం పరిష్కరిస్తున్నది కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే 951 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించింది. తాజాగా కరీంనగర్ నియోజకవర్గంలో మిగిలిన 686 మందికి శుక్రవారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పంపిణీ చేయనుండగా, సర్వత్రా హర్షం మవుతున్నది.
-కరీంనగర్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో చేయూత లేక కులవృత్తులు కుదేలయ్యాయి. బీసీ కులాల్లో అయితే దాదాపు కనుమరుగయ్యాయి. బతుకుదెరువు లేక చాలా మంది ఇతరప్రాంతాలకు వెళ్లిపోయారు. కూలీలుగా మారిపోయి జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరిగి కులవృత్తులకు జీవం పోయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ఒక్కో కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందిస్తున్నా రు. తమ వృత్తులను మెరుగు పర్చుకొని, అవసరమైన ము డి సరుకులు తెచ్చుకుని కులవృత్తులను అభివృద్ధి చేసుకోవాలని, తద్వారా కులవృత్తులపై ఆధారపడి బతుకుతున్న వారి జీవన ప్రమాణాలు మెరుగు పడతాయని భావిస్తున్నారు. బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇది ని రంతర ప్రక్రియగా కొనసాగుతుందని మంత్రి గంగుల కమలాకర్ చెబుతున్నారు. ప్రతి నెలలో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం, ఎంపిక, పంపిణీ ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తామని, ప్రతి నెలా 300 మందికి ఈ లెక్కన ఆ ర్థిక సహాయం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.
కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు 1,777 మంది నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అర్హులైన వారిని గుర్తించేందుకు జిల్లా అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అధికారులు అందించిన వివరాల ప్రకారం కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 800 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 727 మంది అర్హులుగా గుర్తించారు. ఇప్పటి వరకు 41 మందికి పంపిణీ చేశారు. సెప్టెంబర్ 1న మిగతా 686 మందికి మంత్రి గంగుల కమలాకర్ పంపిణీ చేయనున్నారు. ఇక చొప్పదండి నియోజవర్గంలో 300 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 299 మందిని ఎంపిక చేసి 298 మందికి అందించారు. ఇక్కడ ఒక్కరికి మాత్రమే ఇంకా ఇవ్వాల్సి ఉంది. హుజూరాబాద్లో 300 దరఖాస్తులురాగా 297 మందిని అర్హులుగా గుర్తించారు. ఇందులో ఇప్పటి వరకు 291 మందికి ఆర్థిక సహాయం అందించారు. మరో ఆరుగురికి అందించాల్సి ఉంది. మానకొండూర్లో 300 దరఖాస్తులు రాగా, పరిశీలించిన అధికారులు అందరినీ అర్హులుగా గుర్తించారు. ఇందులో ఇప్పటి వరకు 245 మందికి ఆర్థిక సహాయం అందించారు. మిగతా 55 మందికి అందించనున్నారు. ఇక హుస్నాబాద్ నియోజవర్గంలోని రెండు మండలాల నుంచి 77 దరఖాస్తులురాగా 76 మందిని అర్హులుగా గుర్తించి అందరికీ ఆర్థిక సహాయం పంపిణీ చేశారు.
కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి రెండు నెలల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఒకేసారి అందించబోతున్నారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 41 మందికి మాత్రమే ఆర్థిక సహాయాన్ని అందించారు. సెప్టెంబర్ 1న స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో ఒకేసారి 686 మందికి పంపిణీ చేయనున్నారు. ఇది పూర్తయితే తన నియోజకవర్గంలో 727 బీసీ కుల వృత్తుల కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించినట్లవుతుంది. ఈ నేపథ్యంలో బీసీ కుల వృత్తులకు సంబంధించిన వారు తమ జీవనోపాదులు పెంపొందించుకునేందుకు ఈ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.