కార్పొరేషన్, జూన్ 25: ప్రపంచ పర్యాటక కేంద్రంగా కరీంనగర్ను తీర్చిదిద్దే విధంగా మానేరు ఫ్రంట్ను అభివృద్ధి చేయనున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి తెలంగాణచౌక్లో రూ.కోటి 20 లక్షల వ్యయంతో చేపట్టిన ఐలాండ్ సుందరీకరణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే ఏడాదిన్నారలోనే మానేరు రివర్ ఫ్రంట్ను అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ రివర్ ఫ్రంట్లో చేపట్టే ప్రాజెక్ట్ పరిశీలించేందుకు ఈనెల 29న తనతోపాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఇరిగేషన్ అధికారులు, జిల్లా కలెక్టర్తో కూడిన ఆరుగురం సభ్యులం సియోన్ సింగపూర్లో పర్యటించి అకడి ప్రాజెక్టులను పరిశీలిస్తామన్నారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రాజెక్టులను తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనిలో భాగంగానే ఆయా దేశాల్లో చేసిన ప్రాజెక్టులను పరిశీలించి ఇకడికి తీసుకువస్తామని తెలిపారు.
కరీంనగర్ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ వందల కోట్ల నిధులు మంజూరు చేస్తున్నారని పేరొన్నారు. నగరంలోని 13 చౌరస్తాలను ఎనిమిది కోట్ల వ్యయంతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నామని పేరొన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగానే ఇప్పటికే కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించుకున్నామని, ప్రపంచంలో మూడోదైన బిగ్ ఓ ఫౌంటేన్ పనులు కూడా ప్రారంభమయ్యాయన్నారు. నగరంలో ఇప్పటికే అన్ని రోడ్లను అభివృద్ధి చేశామని, సుమారుగా 25 కోట్లతో నగరం నలుమూలల సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేశామని తెలిపారు. తెలంగాణ రాకముందు కరీంనగర్ ఏ విధంగా ఉండేదో ఇప్పుడు ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజలు చూస్తున్నారని తెలిపారు.
రాజకీయ నాయకులు చేసే విమర్శలను పట్టించుకోబోమని, ప్రజలు కోరుకున్న అభివృద్ధిని అందించేందుకే కృషి చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద రెండో నగరంగా కరీంనగర్ను తీర్చిదిద్దే విధంగా ప్రపంచ పర్యాటక కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి హరి శంకర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, కార్పొరేటర్ వాల రమణారావు, నగరపాలక అధికారులు, తదితరులు పాల్గొన్నారు.