విద్యానగర్, జనవరి 19 : పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గురువారం కరీంనగర్లోని ఇందిరానగర్ 42వ డివిజన్ పరిధిలో గల అంబేదర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరాన్ని ఆయన కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మేయర్ సునీల్రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అంబేదర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, కంటి పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని తెలిపారు. పేదలకు ఉచితంగా రేషన్ బియ్యం అందించే దిశగా ఆలోచిస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్ర ప్రజలు అరోగ్యంగా ఉండాలనే దిశగా దేశంలో ఎకడా లేని విధంగా ప్రధాన, ప్రాథమిక, సామాజిక దవాఖానలతో పాటు బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశామన్నారు. దృష్టి లోపంతో ఎవరూ ఇబ్బందులు పడకుండా కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టామని, మొదటి విడతలో జిల్లాలో 5 లక్షల 49 వేల మందికి పరీక్షలు నిర్వహించి సుమారు 76వేల మందికి కళ్లద్దాలను అందించామని, 7800 మందికి ఆపరేషన్ చేశామని గుర్తు చేశారు. రెండో విడుత వంద పనిదినాలు కార్యక్రమ నిర్వహణకు ప్రణాళిక రూపొందించుకున్నట్లు తెలిపారు. పేదలకు పైసా ఖర్చు లేకుండా వారి వద్దకే వెళ్లి కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు రీడింగ్ అద్దాలను పరీక్షలు పూర్తయిన ఐదు నిముషాలలోపే అందిస్తామన్నారు. సమస్య ఎకువగా ఉంటే ప్రిసైబ్డ్ కళ్లద్దాలను శిబిరం నుండే ఆర్డర్ చేస్తారని, ఆశా, ఏఎన్ఎంల ద్వారా ఇంటికే పంపించనున్నట్లు వివరించారు. ఆపరేషన్ అవసరమైన వారిని దవాఖానలకు పంపిస్తామన్నారు.
డివిజన్లో శిబిరానికి హాజరుకాలేని వారు ఆధార్కార్డు సహాయంతో మరోచోట కూడా పరీక్షలు చేయించుకోవచ్చని సూచించారు. త్వరలో ఇంటింటి సర్వే ద్వారా పూర్తి వైద్య వివరాలను సేకరించి, నమోదు చేసేలా ప్రణాళికను రూపొందిస్తామని, దీని ద్వారా అత్యవసర వేళల్లో ఈ వివరాల ఆధారంగా మెరుగైన వైద్యసహాయాన్ని వేగంగా ఆందించే వీలుంటుందన్నారు. కార్యక్రమంలో చివరగా ముగ్గురికి రీడింగ్ అద్దాలను మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి హరిశంకర్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, వైద్యశాఖ జాయింట్ డైరెక్టర్ రాజేశం, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ త్రియంబకేశ్వర్రావు, ఆర్డీవో ఆనంద్ కుమార్, జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జువేరియా, జిల్లా ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల,కార్పొరేటర్లు మేచినేని వనజ అశోక్రావు,కళ్యాణి,గుగ్గిళ్ల జయశ్రీ పాల్గొన్నారు.
ప్రతి డివిజన్లో 15 రోజులు శిబిరం
నగరంలోని 60 డివిజన్లకు గానూ మొదట 13 డివిజన్లలో రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించాం. ప్రతి డివిజన్లో 15 రోజుల పాటు నిర్వహిస్తారు. పరీక్షలు పూర్తయిన వెంటనే అవసరమైన వారికి రీడింగ్ కళ్లద్దాలను అందిస్తారు. మొదటి విడుత నగరంలో 5.49 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. రెండో విడుత విజయవంతంగా నిర్వహించడానికి ఇబ్బందులు రాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటాం.
– కరీంనగర్ మేయర్ వై సునీల్రావు
44 వేలకు పైగా కళ్లద్దాలు తెప్పించాం
కంటిచూపు కోసం దేశంలో ఎకడా ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయలేదు. రాష్ట్రంలోనే మొదటిసారిగా 2018లో కంటి వెలుగును రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మొదటి విడుతలో 24 టీంలు ఉండగా, ఇప్పుడు ప్రతి ఒకరికీ కంటి పరీక్ష నిర్వహించేలా 48 టీంలను ఏర్పాటు చేసి, ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. ఇప్పటికే 44 వేలకు పైగా కళ్లద్దాలను తెప్పించాం. అవసరం మేర ప్రిసైబ్డ్ కళ్లద్దాలను కూడా ఆర్డర్ చేసి ఆశా, ఏఎన్ఎంల ద్వారా అందిస్తాం. 18 ఏండ్లు నిండిన వారందరూ ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి.
– కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్