కార్పొరేషన్, జూన్ 19: తరగిపోతున్న అడవులకు పునర్జీవం పోయడం, ఫల, ఔషధ మొకలు పెంచి ఆరోగ్యవంతమైన తెలంగాణగా మార్చాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమం చేపట్టారని రాష్ట్ర బీసీ సంక్షే మం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం కరీంనగర్ శివారు కేబుల్బ్రిడ్జి సమీపంలో తెలంగాణ హరితోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి హాజరై, మొకలు నాటారు. అనంతరం మాట్లాడుతూ, తెలంగాణలో చెట్ల సంఖ్య పెంచి ఆకుపచ్చని తెలంగాణగా మార్చాలన్న ఆలోచనతోనే ఈ హారితహారం సాగుతుందన్నారు. రాష్ట్రం ఏర్పడిన నుంచి ఇప్పటి వరకు కోట్లాది మొకలు నాటి సంరక్షించడంతో రాష్ట్రంలో పచ్చదనం వెల్లువిరుస్తున్నదన్నారు. ప్రతి గ్రామం, పట్టణంలో నర్సరీలు, ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి పచ్చదనం పెంచడం జరుగుతుందన్నారు.
తొమ్మిదో విడుత హరితహారం కింద కరీంనగర్ జిల్లాలో 44 లక్షల మొకలు నాటడమే లక్ష్యంగా పెట్టామని, హరిత దినోత్సవం సోమవారం ఒక్కరోజే 6లక్షల మొకలు నాటామని, పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపునకు లక్షలాది మొకలు నాటి భావితరాలకు అందివ్వాలన్నారు. మొక్కలు నాటి సంరక్షించాల్సిన అందరిపై బాధ్యత ఉందన్నారు. ఈ నెల 21న మంత్రి కేటీఆర్ కేబుల్ బ్రిడ్జిని ప్రారంభిస్తారని, అనంతరం పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, నగర మేయ ర్ యాదగిరి సునీల్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్కుమార్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, కార్పొరేటర్లు ఆకుల పద్మ ప్రకాష్, కోల మాలతి సంపత్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.