కరీంనగర్లో భారీ జన సందోహం మధ్య బుధవారం బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు మంత్రి తన కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్నారు. స్థానిక ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.
కాగా, తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో కరీంనగర్ గులాబీమయమైంది.
-కార్పొరేషన్, నవంబర్ 8