కొత్తపల్లి, డిసెంబర్ 22 : గత ప్రభుత్వాలు పండుగలను గౌరవించలేదని, తెలంగాణలో అన్ని మతాలకు సమాన ప్రాధాన్యం కల్పిస్తున్నామని, వందకు వంద శాతం తెలంగాణ సెక్యులర్ రాష్ట్రమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశా రు. రాష్ట్రంలో అందరికీ అందినట్టే క్రైస్తవులకూ సంక్షేమ ఫలాలు, చేయూతనందిస్తున్నామని చెప్పారు. గురువారం రాత్రి కొత్తపల్లిలోని జయ గార్డెన్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. అనంతరం క్రైస్తవ మతపెద్దలు మంత్రిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ క్రైస్తవుల కోసం సీఎం కేసీఆర్ పండుగను నిర్వహించడమే కాకుండా క్రైస్తవ భవన నిర్మాణానికి రెండెకరాలు, రూ.10 కోట్లు మంజూ రు చేశారన్నారు. ఏ పండుగ వచ్చినా మనమం తా ఐక్యంగా జరుపుకొంటామన్నారు.
మనుషుల్ని మనుషులుగా ప్రేమించే తత్వం ఉంటుందనడానికి తెలంగాణ రాష్ట్రం గొప్ప ఉదాహరణ అని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ రాజేశ్వర్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో క్రైస్తవులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని, గతంలో ఉన్న నీటి బాధలు ఇప్పుడు లేవని, మిషన్ భగీరథ పథకం త్వరలో నూరుశాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతం కరంట్ స మస్య లేని రాష్ట్రాన్ని చూస్తున్నామన్నారు. కు లం, మతం అనేది లేకుండా అర్హులకు రూ.2 వేల పింఛన్ ఇచ్చి ఆదుకునే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, ఎంపీపీ పిల్లి శ్రీలత -మహేశ్, వ్యవసాయ మారెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, మాజీ ఎంపీపీ రమేశ్, మాజీ జడ్పీ కోఆప్షన్ జమీలొద్దీన్, ప్రతాప్రెడ్డి, పాస్టర్లు డేవిడ్ రాజు, ప్రశాంత్ రెడ్డి, ప్రశాంత్ కుమార్, తిమోతి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.