సాట్ డిప్యూటీ డైరెక్టర్ ధనలక్ష్మి
సిరిసిల్ల టౌన్, జూన్ 6: అధునాతన సౌకర్యాలతో జిల్లా కేంద్రంలో నిర్మించిన మినీ స్టేడియం తెలంగాణకే తలమానికంగా ఉన్నదని సాట్ డిప్యూటీ డైరెక్టర్ ధనలక్ష్మి కొనియాడారు. జయప్రకాశ్నగర్లో అందుబాటులోకి తెచ్చిన మినీ స్టేడియాన్ని సంగారెడ్డి డీఎస్వైవో వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ధనంజయతో కలిసి సోమవారం ఆమె సందర్శించారు. స్టేడియంలో ఏర్పా టు చేసిన క్రీడా సౌకర్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అత్యున్నతస్థాయి ప్రమాణాలతో స్టేడియా న్ని నిర్మించారని కొనియాడారు.
క్రీడాకారులందరికీ స్టేడియం సువర్ణావకాశమని చెప్పారు. క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు స్టేడియాలు ఉపయోగపడుతాయన్నారు. క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని సూచించారు. ఈ నెల 12న వాలీబాల్ అకాడమీ సెలక్షన్ నోటిఫికేషన్ వేస్తున్నట్లు ప్రకటించారు. ఇక్కడ టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీకుమార్, కార్యదర్శి రాందాస్, పేట అసోసియేషన్ అధ్యక్షుడు దేవతా ప్రభాకర్ ఉన్నారు.