సమ్మక్క, సారలమ్మ గద్దెలపై కొలువుదీరడంతో శుక్రవారం భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే వెల్లువలా తరలివచ్చి, భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తల్లులను దర్శించుకున్నారు. గంటల తరబడి క్యూలో నిలబడి మరీ అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు. పసుపు, కుంకుమ, ఒడిబియ్యం, నిలువెత్తు బంగారం సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. ‘సల్లంగ సూడు తల్లీ’ అంటూ వనదేవతలను వేడుకున్నారు.
కరీంనగర్ కమాన్ చౌరస్తా/ హుజూరాబాద్/ శంకరపట్నం/ వీణవంక, ఫిబ్రవరి 23 : గద్దెలపై సమ్మక్క, సారలమ్మ కొలువుదీరడంతో శుక్రవారం భక్తులు వెల్లువలా తరలివచ్చారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 50 చోట్లకుపైగా జాతరలు జరగ్గా, లక్షలాది మంది దర్శించుకున్నారు.
రేకుర్తి, కేశవపట్నంతోపాటు గోదావరిఖని, నీరుకుల్ల, కొలనూర్, వీణవంకలో గంటల తరబడి క్యూలో వేచి ఉండి మరీ తల్లులను దర్శించుకున్నారు. అంతటా ఉదయం నుంచి రాత్రి దాకా అమ్మవార్ల సేవలో తరించారు. వనదేవతలకు ఒడిబియ్యం, చీర, పసుపు, కుంకుమ, బంగారం (బెల్లం) సమర్పించి, పిల్లాపాప, గొడ్డూ గోదను చల్లంగా చూడాలని వేడుకున్నారు. జాతర ప్రాంతాల్లో ఎదురుకోళ్లు, గొర్రెలు, మేకలను బలిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అక్కడే వంటలు చేసుకొని, సామూహిక భోజనాలు చేసి, తిరుగుపయనమయ్యారు.
వీణవంక మినీ మేడారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకోగా, ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కుటుంబసభ్యులతో కలిసి అమ్మవార్లను దర్శించుకున్నారు. హుజూరాబాద్లోని రంగనాయకుల గుట్ట, జూపాకలో ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డితో.., గంగాధర మండలం బూరుగుపల్లిలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వర్రావుతో కలిసి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అమ్మవార్లను దర్శించుకున్నారు. ఎండపల్లి మండలం రాజారాంపల్లి, ధర్మారంలో విప్ అడ్లూరి లక్ష్మణ్, సుల్తానాబాద్ మండలం తొగర్రాయిలో ఎమ్మెల్యే విజయరమణారావు, గంగాధర మండలంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, పెద్దపల్లి, ఓదెల మండలాల్లో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అమ్మవార్ల కు మొక్కులు చెల్లించుకున్నారు. కోనరావుపేట మండలం శివంగాళపల్లిలో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, బీఆర్ఎస్ వేములవాడ ని యోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు పూజలు చేశారు.
గమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని సమ్మక్క జాతరల్లో భక్తుల కోసం సెల్ చార్జింగ్ పాయింట్స్ ఏర్పాటు చేసి వ్యాపారం చేసుకుంటున్నారు. ఓదెల మండలం కొలనూర్ జాతరలో వచ్చిన భక్తులకు సెల్ఫోన్ చార్జింగ్ కోసం ప్రత్యేకంగా షాపులు ఏర్పాటు చేశారు. రూ.20 చెల్లిస్తే ఫుల్ చార్జింగ్ చేసి ఇచ్చారు.
-ఓదెల, ఫిబ్రవరి 23