కార్పొరేషన్, జూన్ 22 : కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నగరంలోని ఏ డివిజన్ కార్పొరేటర్గా గెలిచినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కరీంనగర మేయర్ యాదగిరి సునీల్రావు సవాల్ చేశారు. పొరపాటున, గ్రహపాటుగా ఆయన ఎంపీగా గెలిచారని, ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఓటమి పాలు అయ్యాయడని ఎద్దేవా చేశారు. నిజంగానే పొన్నంకు దమ్ముంటే తను నివాసముంటున్న 36వ డివిజన్లో తమ కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీపై పోటీ చేసి గెలువాలని సవాల్ చేశారు. కరీంనగర్ నగరపాలక సంస్థలోని మేయర్ చాంబర్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగున్నర ఏండ్లుగా ప్రజా సమస్యలపై స్పందించని, అవగహన లేని నాయకులు కూడా ఇప్పుడు ఎన్నికల సీజన్ వచ్చిందని మళ్లీ కనబడుతున్నారని దుయ్యబట్టారు. అలాంటి వారిని చూసి జాలి పడడం తప్ప ఏమి చేయలేమని ఎద్దేవా చేశారు. పొన్నం ప్రభాకర్ ఎందుకు పనికి రాని చెత్తగా మారారని ధ్వజమెత్తారు.
కనీస రాజకీయ విలువలు లేకుం డా, సంస్కారహీనంగా మర్యాద లేకుండా విమర్శలు చేయడం సరికాదన్నారు. తాము కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడవచ్చని, కానీ మాకు సంస్కారం అడ్డువస్తుందన్నారు. కరీంనగర్లో కాంగ్రెస్ నాయకుల్ని పూర్తిగా ఖతం చేసి తాను కూడా కనుమరుగయ్యే స్థితిలో పొన్నం ఉన్నాడని విమర్శించారు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఒక్క కాంగ్రెస్ నాయకుడికి కూడా నామినేటేడ్ పోస్టు ఇప్పించలేదని, తన సోదరుడికి మాత్రం మంచి పదవి ఇప్పించుకున్నారని ఆరోపించారు. పార్టీలో మరొక నాయకుడి ఎదుగుదలను ఓర్వలేని వ్యక్తి పొన్నం అని విమర్శించారు. ప్రతి ఒక్కరినీ అణిచివేసి, భూస్థాపితం చేసిన వ్యక్తి అని ధ్వజమెత్తారు. కరీంనగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలువకపోవడం పొన్నం దయేనని ఎద్దేవా చేశారు. మళ్లీ ఎన్నికల సీజన్ వచ్చిందని ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్యేకు పోటీ చేసి ఓడిపోయి, ఎంపీకి పోటీ చేసి ఓడిపోయి, జడ్పీటీసీ, కార్పొరేటర్కు కూడా పోటీ చేసి ఓడిపోవవడం ఆయనకు అలవాటేనన్నారు.
పొన్నం ప్రభాకర్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, లేకపోతే సహించేది లేదని హెచ్చరించారు. ఎన్నికల్లో ఇ ప్పటి వరకు ఓటమి అనేది తెలియని నాయకు డు గంగుల కమలాకర్ అన్నారు. ఎంపీగా గెలిచినా తెలంగాణ కోసం తృణప్రాయంగా పదవికి రాజీనామా చేసిన నాయకుడు వినోద్కుమార్ అని పేర్కొన్నారు. ఓడిపోయినా కూడా నిత్యం ప్రజల మధ్యే ఉండి, జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారన్నారు. వారిని విమర్శించే కనీస నైతిక అర్హత కూడా పొన్నంకు లేదన్నారు. కాంగ్రెస్ నాయకులే ఇప్పుడు పొన్నం మళ్లీ వచ్చాడని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా పొన్నం వ్యక్తిగతంగా నోరు జారవద్దని సూచించారు. లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హె చ్చరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి హరిశంకర్, కార్పొరేటర్లు చాడగోండ బుచ్చిరెడ్డి, వాల రమణారావు, నేతికుంట యాదయ్య, బండారి వేణు, గంట కల్యాణి, గుగ్గిళ్ల జయశ్రీ, గందె మాధవి తదితరులు పాల్గొన్నారు.