కార్పొరేషన్, ఏప్రిల్ 14: అంబేద్కర్ ఆశయాల సాధనకు యువత కృషి చేయాలని మేయర్ యాదగిరి సునీల్రావు పిలుపునిచ్చారు. నగరంలోని బల్దియా కార్యాలయ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి శుక్రవారం ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, అంబేద్కర్ వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసిన మహనీయుడని పేర్కొన్నారు. అలాగే, అంబేద్కర్ విగ్రహానికి డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి-హరిశంకర్, కమిషనర్ సేవా ఇస్లావత్, కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ అధికారులు పూలమాలలు
విద్యానగర్, ఏప్రిల్ 14: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో 200 మంది రోగులకు, అటెండెన్స్కు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల, సీనియర్ ఎనలిస్ట్ తుమ్మల రవీందర్, సైంటిస్ట్ జవ్వాజి హరికృష్ణ, శివకృష్ణ, రమేశ్, ప్రభాకర్, వాసు, శ్రీనాథ్, అభి, అనిల్, రాకేశ్, దవాఖాన సిబ్బంది పాల్గొన్నారు.
హౌసింగ్బోర్డుకాలనీ, ఏప్రిల్ 14: అంబేదర్ స్టేడియంలోని అంబేదర్ విగ్రహానికి తెలంగాణ జాగృతి యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉయ్యాల విష్ణువర్ధన్ గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు. జాగృతి నాయకులు వంగపల్లి సందీప్రెడ్డి, బుర్ర ప్రభాకర్, వినీత్కుమార్, సాయి లోకేష్, ఆదిత్య పాల్గొన్నారు.
కోర్టుచౌరస్తా, ఏప్రిల్ 14: జిల్లా కోర్టు సముదాయంలో అంబేదర్ చిత్రపటానికి కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘునందన్ రావు, ప్రధాన కార్యదర్శి లింగంపల్లి నాగరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కొరివి వేణుగోపాల్, ఎస్సీ, ఎస్టీ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు, ఏపీపీ గడ్డం లక్ష్మణ్, అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, సీనియర్, జూనియర్, మహిళా న్యాయవాదులు, న్యాయవాద క్లరులు పాల్గొన్నారు.
కమాన్చౌరస్తా, ఏప్రిల్ 14: అల్గునూర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి కార్పొరేటర్ సల్ల శారద-రవీందర్, కేడీసీసీబీ డైరెక్టర్ సింగిరెడ్డి స్వామిరెడ్డి, అంబేద్కర్ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ సంఘం నాయకులు గూడ కనకయ్య, దాసం నాగేందర్, దాసం ప్రేమ్కుమార్, దాసం శ్రీధర్, దాసం రవీందర్, దాసం కమలాకర్, జక్కుల రవికుమార్, దాసం కిష్టస్వామి, దాసం శ్రీకాంత్, కౌశిక్, కొమురయ్య, సిరిసిల్ల అంజయ్య, ప్రవీణ్, రవికుమార్, ప్రభాకర్, రవీందర్, సిరిసిల్ల అంజయ్య, నాయకులు కాల్వ మల్లేశం, కంది రాంచంద్రారెడ్డి, జాప రత్నాకర్రెడ్డి, చిందం కిష్టయ్య, చిల్ల పరశురాం, అంబేద్కర్, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనంతరం డివిజన్లో బైక్ ర్యాలీ తీశారు. నగరంలోని ఎస్సారార్ కళాశాలలో అంబేద్కర్ చిత్రపటానికి ఇన్చార్జి ప్రిన్సిపాల్ మేకల హిమబిందు పూలమాల వేసి నివాళులర్పించారు. స్టాఫ్ క్లబ్ కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్, అధ్యాపకుడు మహేశ్, ఎన్సీసీ అధికారి పీ రాజు, రామచంద్రం, డాక్టర్ శంకర్, ప్రదీప్, శ్రావణ్, పురుషోత్తం, చంద్రమౌళి, డీడీ నాయకుడు, నాగరాజు, కొమురయ్య, సురేశ్, కిరణ్, సదానందం తదితరులు పాల్గొన్నారు. రేకుర్తి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గోనె శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పల్లెపాటి వేణుగోపాల్ రావు ఆధ్వర్యంలో నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇక్కడ నాయకులు సత్యనారాయణ రెడ్డి, చొల్లేటి శ్రీనివాస్, కిషన్, నాగరాజు, శ్రీనివాస్ రెడ్డి, అశ్పాక్ హుస్సేన్, మొగిలి కాంతయ్య, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని పదో తరగతి స్పాట్ కేంద్రంలో అంబేద్కర్ చిత్రపటానికి డీఈవో జనార్దన్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మీసాల మల్లిక్, కొమ్ము రమేశ్, ముస్కు తిరుపతిరెడ్డి, కట్టా రవీంద్రాచారి, పోరెడ్డి దామోదర్ రెడ్డి, రంగారావు, ఆదర్శన్ రెడ్డి, గోనె శ్రీనివాస్, నందికొండ విద్యాసాదర్, రాజయ్య, శంకర్, విజయేందర్ రెడ్డి, కుమార్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. సదాశివపల్లి చౌరస్తాలో అంబేద్కర్ జయంతి సందర్భంగా స్థానిక సంఘం నాయకులు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా, సీఐ మాదాసు రాజ్కుమార్ ప్రారంభించారు. నాయకులు నాగెల్లి అరుణ్, చిలుక రాజు, కొంకటి శ్రీనివాస్, చిలుక శేఖర్, కందుకూరి శ్రవణ్, రమేశ్, అరుణ్, రాకేశ్, శ్రీనివాస్, కుమార్, చిలుక నరేందర్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని కోర్టు చౌరస్తాలో యూఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు సంద గణేశ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. రేకుర్తి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పీఆర్టీయూ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముస్కు తిరుపతి రెడ్డి, మర్రి జైపాల్ రెడ్డి, జాలి మహేందర్ రెడ్డి, మోహన్ రెడ్డి, నాగేశ్వర్ రావు, శ్రీనివాస్ రెడ్డి, రాంమోహన్, అభిషేక్ పాల్గొన్నారు. వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ పాఠశాలలో అంబేదర్ చిత్రపటానికి విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల, కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తెలంగాణచౌక్, ఏప్రిల్ 14: కరీంనగర్ బస్టాండ్లో అంబేద్కర్ చిత్రపటానికి జోనల్ ఈడీ వెంకటేశ్వర్లు, ఆర్ఎం ఖుస్రోషాఖాన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. బస్టాండ్ స్వాగత తోరణానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు నామకరణం చేస్తూ బోర్డును ఆవిష్కరించారు. డిప్యూటీ ఆర్ఎం రాంచందర్రావు, పర్సనల్ మేనేజర్ చంద్రయ్య, డిపో మేనేజర్లు ప్రణీత్, మల్లయ్య, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ నాయీబ్రాహ్మణ సేవా సంఘం కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి సంఘం జిల్లా అధ్యక్షుడు నీలం మొండయ్య పూల మాల వేసి నివాళులర్పించారు. సంఘం నాయకులు జంపాల సంపత్, వెంకటేశ్, శ్రీనివాస్, సదానందం, వేణు పాల్గొన్నారు. కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్, ఓసీ సామాజిక సంఘాల జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు, తెలంగాణ రజక సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు పూసాల సంపత్ పూల మాలలు వేసి నివాళులర్పించారు. సుభాషిణి, సురేందర్, కృష్ణ పాల్గొన్నారు. సీపీఎం కార్యాలయం (ముకుందాలాల్ మిశ్రా భవనం)లో అంబేద్కర్ చిత్రపటానికి పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవారెడ్డి పూల మాల వేసి నివాళులర్పించారు. నాయకులు గుడికందుల సత్యం, ముకుందరెడ్డి, అరవింద్, ఎడ్ల రమేశ్, బీమాసాహెబ్ పాల్గొన్నారు. సీపీఐ కార్యాలయం (బద్ధం ఎల్లారెడ్డి భవనం)లో అంబేద్కర్ చిత్రపటానికి పార్టీ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి పూల మాల వేసి నివాళులర్పించారు. నాయకులు సురేందర్రెడ్డి, పైడిపల్లి రాజు, కసిరెడ్డి మణకంఠరెడ్డి, సదానందం, బూడిద సదాశివ, కుమార్ పాల్గొన్నారు. కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి సంఘం జిల్లా అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్, పట్టణాధ్యక్షుడు రాజేందర్ పూల మాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు రాంగోపాల్రెడ్డి, సంపత్పటేల్, సాగర్ తిరుపతి పాల్గొన్నారు.
కొత్తపల్లి, ఏప్రిల్ 14: జిల్లా కేంద్రంలోని సెయింట్ జోన్ హైస్కూల్స్లో జిల్లా వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అంతడుపుల శ్రీనివాస్, ఎండీ యూనిస్ పాషా, వీర్పాల్రెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అశోక్రెడ్డి, మారం స్వదేశీకుమార్, కోట లక్ష్మీరెడ్డి, కొమురోజు కృష్ణ, వీరన్న, మర్రి చంద్రశేఖర్, ఎల్వీ రమణ, హనుమంతు, జి శ్రీను, కట్ట సంతోష్, జిల్లా సాఫ్ట్బాల్ కార్యదర్శి వేణుగోపాల్, మాజీ ఎస్జీఎఫ్ కార్యదర్శి కనకం సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణచౌక్,ఏప్రిల్14: రాజ్యసభ సభ్యుడు గ్రీన్ ఇండియా చాలెంజ్ ఫౌండర్ చైర్మన్ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం ఆధ్వర్యంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో భారత ప్రైవేట్ ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు రాములు, పూసాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోల శ్రీనివాస్, వైశ్య ఫెడరేషన్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.