అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటేశారు. సిరిసిల్ల అభ్యర్థి, మంత్రి కేటీఆర్ హైదరాబాద్లో, వేములవాడ బీఆర్ఎస్ అభ్య ర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు తన కుటుంబ సభ్యులు, రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ చల్మెడ రాజేశ్వర్రావు, మాజీ న్యాయ శాఖ మంత్రి చల్మెడ ఆనందరావుతో కలిసి కోనరావుపేట మండలం మల్కపేటలో, వేములవాడ పట్టణంలోని ఓల్డ్ అర్బన్ కాలనీలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు, బోయినపల్లి మండ లం కొదురుపాకలో రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్, కుటుంబ సభ్యులు, తంగళ్లపల్లి మండలం కస్బెకట్కూర్లో సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, జిల్లా కేంద్రంలోని గీతానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్పీ అఖిల్మహాజన్.
సిరిసిల్ల పట్టణం శాంతినగర్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనురా గ్ జయంతి, కుటుంబ సభ్యులు, అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, ఆర్డీవో ఆనంద్కుమార్, జిల్లా కేంద్రంలోని గీతానగర్ ప్రభుత్వ పాఠశాలలో మున్సిపల్ చైర్పర్సన్ కళ, చక్రపాణి, గంభీరావుపేట మండలం గజసింగవ రంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, తంగళ్లపల్లి మండలంలో బీఆర్ఎస్ రాష్ట్ర నేత చీటి నర్సింగరావు, వేములవాడలో మున్సిప ల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
-రాజన్న సిరిసిల్ల, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ)