గన్నేరువరం, అక్టోబర్ 30: కాంగ్రెస్ మాయమాటను నమ్మి మోసపోవద్దని, మోసపూరిత హామీలతో ఆగం కావొద్దని మానకొండూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హెచ్చరించారు. ముఖ్యమంతిర కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. తనను మరోసారి అఖండ మెజార్టీతో ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం గన్నేరువరం మండలం పారువెల్ల గ్రామంలోని శ్రీలక్ష్మీగణపతి ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, ముడుపుకట్టి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
అనంతరం మండలంలోని యస్వాడ, గోపాల్పూర్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, ‘ప్రజలు.. సారూ.. కారూ.. కేసీఆర్ సరారు’ అనే నినాదంతోనే ముందుకెళ్తున్నారని పేరొన్నారు. కాంగ్రెస్ నాయకుల మాటలకే గ్యారెంటీ లేదని, ఇక ఆరు గ్యారంటీలకు గ్యారంటీ ఏమిటని ప్రశ్నించారు. కరోనా సమయంలో ఆ పార్టీ నాయకుడు కవ్వంపల్లి ఎకడున్నాడు? ఆయనకు అప్పుడు నియోజకవర్గ ప్రజలు గుర్తు రాలేదా..? అని ప్రశ్నించారు. కవ్వంపల్లికి ప్రజలపై ప్రేమ ఉంటే ఎందుకు ఉచితంగా వైద్యం చేయలేదని నిలదీశారు.
ఎన్నికలు వస్తేనే ఆయన ఊర్లలోకి వచ్చి దొంగ మాటలు చెబుతాడని, వాటిని నమ్మి ఆగం కావొద్దని ప్రజలకు సూచించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ తీసుకువచ్చిన మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల సాయం చేస్తామన్నారు. కులవృత్తులపై ఆధారపడిన బీసీలకు లక్ష సాయం చేస్తున్నామని గుర్తు చేశారు. పారువెల్ల నుంచి వడ్లూరు గ్రామానికి రోడ్డు, చెరువు మత్తడిపై బ్రిడ్జి నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చారు.
బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన యాదవ, పద్మశాలీ సంఘాల నాయకులు పలువురు, బీఎస్పీ నాయకులు, వీరపూర్ గ్రామానికి బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరగా, వారికి గులాబీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. ప్రచారానికి వచ్చిన రసమయి బాలకిషన్కు ఆయా గ్రామాల్లో మహిళలు బతుకమ్మలు, బోనాలతో ఘనస్వాగతం పలికారు. బొట్టుపెట్టి, మంగళహారతులు పట్టారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రవీందర్ రెడ్డి, ఎంపీపీ మల్లారెడ్డి, సర్పంచ్ మోహన్ రెడ్డి, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు బద్దం తిరుపతి రెడ్డి, మహేందర్, సురేశ్, రెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు.