Veenavanka | వీణవంక, ఫిబ్రవరి 8 : వీణవంక మండల కేంద్రంలోని అతిపురాతన శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా స్వామి వారికి లడ్డులతో మహాభిషేక కార్యక్రమాన్ని ఆదివారం కన్నుల పండువగా నిర్వహించారు. అర్చకులు సుబ్రమణ్యంశర్మ మంత్రాల మధ్య స్వామి వారికి అభిషేకాన్ని చేయగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ రామిడి శ్రీనివాస్, ఉపసర్పంచ్ తాళ్లపెల్లి మహేశ్ గౌడ్, సభ్యులు మహాశివరాత్రి కరపత్రాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 15, 16 తేదీలలో వెయ్యేళ్ల చరిత్ర కలిగిన వీణవంక శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఆలయకమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దీవెనలు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాసవి, వనిత క్లబ్ సభ్యులు అల్లెంకి సాంబమూర్తి, రమేష్, నాగన్న, విశ్వంభర్, లక్ష్మయ్య, స్థానికులు పాల్గొన్నారు.