కమాన్చౌరస్తా/మానకొండూర్/ వీణవంక/సైదాపూర్/ శంకరపట్నం/ ఇల్లందకుంట/ జమ్మికుంట/ చొప్పదండి/ కొత్తపల్లి/ తిమ్మాపూర్/ గన్నేరువరం/ గంగాధర/ హుజూరాబాద్టౌన్/ రూరల్/ చిగురుమామిడి, మార్చి 8: జిల్లా వ్యాప్తంగా ప్రజలు మహా శివరాత్రి వేడుకలను శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా శైవాలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. కాగా, కరీంనగర్లోని పాత బజార్ శ్రీ గౌరీశంకరాలయంలో ఆలయ ప్రధాన అర్చకుడు పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో అర్చకులు పురాణం చంద్రమౌళిశర్మ, పురాణం శ్రీనివాస శర్మ, మంగళంపల్లి శ్రీనివాస శర్మ ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి అభిషేకాల అనంతరం పల్లకీ సేవ, రథోత్సవం నిర్వహించారు.
ఆలయంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, మేయర్ సునీల్రావు, కార్పొరేటర్లు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త పొద్దుటూరి శ్రీనివాస్, ఈవో ఉడతల వెంకన్న ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. అలాగే, కమాన్ సమీపంలోని శ్రీరామేశ్వరాలయంలో ప్రధాన అర్చకుడు ఉరుమడ్ల శ్రీనివాస శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీహరినగర్లోని వీరాంజనేయ శివాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఆలయ కమిటీ సభ్యులు బీర్ల బీరయ్య, నర్నేని మనోహర్ రావు, బోయినపల్లి హనుమంతరావు, పీచర నరేందర్ రావు, దాచవరం మనోహర్ రావు, చిప్ప బాలేశ్, బీర్ల వెంకటి, బీర్ల పెద్ద కనకయ్య, జకిలేటి లోహిత్ రావు, పెరుక సత్తయ్య, తోట రవీందర్ తదితరులు పాల్గొన్నారు. రేకుర్తిలోని అమృతేశ్వర మహాశివాలయం, భగత్నగర్లోని భవానీ శంకరాలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు చేశారు.
భగత్నగర్లోని అయ్యప్ప ఆలయ ప్రాంగణంలోని శివాలయంలో మేయర్ వై సునీల్ రావు దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో కొస్న కాంతారెడ్డి, భక్తులు పాల్గొన్నారు. 8వ డివిజన్ (అల్గునూర్)లోని పురాతన శివాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శివ కల్యాణం కనుల పండువగా నిర్వహించగా, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. ఆదర్శనగర్లోని రాజరాజేశ్వరాలయం, విద్యానగర్ శ్రీ వేంకటేశ్వరాలయం, సప్తగిరికాలనీలోని శ్రీ కోదండరామాలయం, రామచంద్రాపూర్ కాలనీలోని పంచముఖ హనుమదీశ్వరాలయం, శివభక్తమార్కండేయ స్వామి ఆలయం, కమాన్రోడ్లోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో స్వామి వారికి అభిషేకం, అర్చనలు, ప్రత్యేక పూజలు చేశారు.
మానకొండూర్ మండల కేంద్రంతో పాటు ఈదులగట్టెపల్లి, గంగిపల్లి, కొండపల్కల, లింగాపూర్ గ్రామాల్లోని శివాలయాల్లో శివపార్వతుల కల్యాణం జరిపించారు. గంగిపల్లిలో స్వామి వారికి ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పట్టు వస్ర్తాలను సమర్పించారు. కల్యాణ మహోత్సవాన్ని తిలకించి, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఈదులగట్టెపల్లి శివాలయంలో పూజలు చేశారు. ఎంపీపీ ముద్దసాని సులోచన-శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీలు కనవేని శ్రీనివాస్, రంగు భాస్కరాచారి, చలిగంటి సంపత్, కేడీసీసీ డైరెక్టర్ మీస సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. శంకరపట్నం మండలంలోని శైవక్షేత్రాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కొత్తగట్టు శ్రీమత్స్యగిరీంద్రస్వామి గుట్టపై ఏర్పాటు చేసిన అగ్ని గుండాలపై భక్తులు నడిచి తమ భక్తిభావాన్ని చాటుకున్నారు. ఇల్లందకుంట మండల కేంద్రంతో పాటు కనగర్తిలో నిర్వహించిన శివకల్యాణానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎంపీపీ పావని-వెంకటేశ్ హాజరయ్యారు. ఆలయ ఈవో సుధాకర్, మాజీ సర్పంచులు, భక్తులు పాల్గొన్నారు. సైదాపూర్ మండలం ఎక్లాస్పూర్, గుజ్జులపల్లి, బొమ్మకల్ గ్రామాల్లోని శివాలయాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేశారు. వీణవంక మండల కేంద్రంతో పాటు నర్సింగాపూర్, చల్లూరు గ్రామాల్లో నిర్వహించిన శివరాత్రి వేడుకలకు ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి హాజరయ్యారు.
వేడుకల్లో ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, వైస్ ఎంపీపీ లత-శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. జమ్మికుంట పట్టణంతో పాటు మండలంలోని శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్తపల్లి పట్టణంలోని సీతారామ ఆంజనేయస్వామి సహిత సాయిబాబా ఆలయంలో మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, కౌన్సిలర్లు కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేశారు. వేడుకల్లో వాసాల రమేశ్, వేముల చంద్రశేఖర్, చెట్టిపెల్లి ప్రభాకర్, కనకారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు జనార్దన్రెడ్డి, సామల శ్రీనివాస్, సిరిపురం కృష్ణం రాజు, భక్తులు పాల్గొన్నారు.
గంగాధర మండలం కొండన్నపల్లి సహస్రలింగేశ్వరాలయం, కోట్లనర్సింహులపల్లి సోమేశ్వరాలయంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రత్యేక పూజలు చేశారు. అలాగే, కొండన్నపల్లి సహస్ర లింగేశ్వరాలయంలో జడ్పీటీసీ పుల్కం అనురాధ-నర్సయ్య పూజలు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా మండలంలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. గన్నేరువరం మండలం పారువెల్ల లక్ష్మీగణపతి, ఖాసీంపేటలోని మానసాదేవి, గన్నేరువరం, జంగపల్లిలోని శివభక్త మారండేయ, చీమలకుంటపల్లి, మైలారం గ్రామాల్లోని మల్లికార్జున స్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చొప్పదండి పట్టణంలోని శివకేశవాలయంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, వైస్ చైర్పర్సన్ ఇప్పనపల్లి విజయలక్ష్మి-సాంబయ్య, సింగిల్విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, ఎస్ఐ ఉపేంద్రాచారి, కౌన్సిలర్లు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో శివ కల్యాణం, కేశవ కల్యాణ మహోత్సవం నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హుజూరాబాద్ మండలం చెల్పూర్, కందుగుల, సిర్సపల్లి గ్రామాల్లోని శివాలయాలు శివనామస్మరణతో మార్మోగాయి.
చెల్పూర్ శివాలయంలో శివ కల్యాణం జరిపించారు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని మృత్యుంజయ ఆలయంలో చైర్మన్ చల్ల మోహన్ రెడ్డి, ఎంపీపీ కేతిరెడ్డి వనిత-దేవేందర్ రెడ్డి, ఎస్ఐ బెల్లం చేరాలు, టీఎన్జీవోస్ నాయకులు మారం జగదీశ్వర్, సంగం లక్ష్మణరావు, బట్టు కరుణాకర్, పోలు కిషన్, దారం శ్రీనివాస్ రెడ్డి, వంటల రవీందర్ రెడ్డి, గంగారపు రమేశ్, తదితరులు పూజలు చేశారు. నుస్తులాపూర్లోని వీరాంజనేయస్వామి సహిత భవానీశంకరాలయంలో అర్చకుడు ఉరుమడ్ల కిరణ్శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
పొట్లపల్లిలోని స్వయంభు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ దర్శించుకున్నారు. కరీంనగర్ రూరల్ మండలంలోని శివాలయాల్లో మహాశివరాత్రి వేడుకలు, శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. హుజూరాబాద్ పట్టణంలోని బోర్నపల్లి రాజరాజేశ్వరస్వామి, ప్రతాపవాడలో గల శ్రీభవానీ సమేత సాంబ సదాశివాలయం, కిందివాడలోని శ్రీభవానీశంకర మహా దేవాలయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, బల్దియా చైర్పర్సన్ గందె రాధిక-శ్రీనివాస్, వైస్ చైర్పర్సన్ నిర్మల-శ్రీనివాస్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, భక్తులు పూజలు చేశారు.