గంభీరావుపేట, ఆగస్టు 16 : లింగన్నపేటకు చెందిన జగ్గన్నగారి శ్రీనివాస్రావు మంగళవారం హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు మొదటి హాల్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో శ్రీనివాస్రావు అదనపు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు.
మండలంలోని లింగన్నపేటతోపాటు ఆయా గ్రామాలకు చెందిన న్యాయవాదులు, నేతలు, ప్రజాప్రతినిధులు వారిని కలసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో ఏఎంసీ మాజీ చైర్మన్ లింగన్నగారి దయాకర్రావు, నేతలు ఆనందరావు, రాజేశ్వర్రావు, శ్రీనివాస్, రవీందర్రావు తదితరులు ఉన్నారు.