గోదావరిఖని, సెప్టెంబర్ 6: సీఎం కేసీఆర్ పాలనలో అమలవుతున్న పథకాలతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని, సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్నామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ పాలనను మళ్లీ కోరుకుంటున్నారని, మూడోసారి సీఎంను చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారన్నారు. బుధవారం గోదావరిఖనిలోని క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరికలు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చందర్తో కలిసి పాల్గొన్నారు. పుట్టిన బిడ్డ తల్లి దగ్గర ఉండడం ఎంత న్యాయమో.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనలో ఉండడం అంతే న్యాయమన్నారు. కొన్ని విచ్ఛిన్నకర శక్తులు ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని,
అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ రాష్ర్టాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ కోరుకంటి చందర్ను మెజార్టీతో గెలిపించాలని కోరారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాల్సిన మెడికల్ కాలేజీని రామగుండంలో ఏర్పాటు చేయించిన ఘనత ఆయనదేనని కొనియాడారు. నియోజకవర్గంలోని బీరువా, స్టీల్ ఫర్నిచర్, మేస్త్రీ, పెయింటర్స్ అసోసియేషన్ సభ్యు లు, ముర్మూరు గ్రామస్తులు 100 మందికి పైగా బీఆర్ఎస్లో చేరగా, వారికి విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే చందర్ కండువాలు కప్పి ఆహ్వానించారు. 36 మందికి సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు రూ.25.50లక్షల విలువైన చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో మేయర్ అనిల్కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్, నాయకులు కెంగర్ల మల్లయ్య, జాహిద్ పాషా, నీలం పద్మ, అడ్డాల స్వరూప ఉన్నారు.