Bhagiratha Maharshi | కలెక్టరేట్/వీణవంక, ఏప్రిల్ 21 : సగర భగీరథ మహర్షి జయంతిని విజయవంతం చేయాలని సగర సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాస్ సగర కోరారు. ఈ మేరకు కరీంనగర్లో కలిసి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ చిత్రామిశ్రాను కలిసి వినతిపత్రం అందజేయడంతో పాటు అన్ని గ్రామాల్లో వాల్పోస్టర్లు, కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల23న సగర భగీరథ మహర్షి జయంతి సందర్భంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం గొప్పవిషయమన్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో గురువారం నిర్వహించి కార్యక్రమానికి సగర బంధువులతో పాటు అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో విజయవంతం చేయాలని కోరారు.
మహనీయుని జయంతి సందర్భంగా కుల బంధువులు, సామాజిక సేవా కార్యకర్తలు, బహుజనులకు సత్కారం చేయాలని కలెక్టర్ను కోరినట్లు తెలిపారు. ఈ కలెక్టరేట్ కార్యాలయంతో పాటు జిల్లాలోని అన్ని గ్రామాల్లో కరపత్రాలు, వాల్పోస్టర్లను ఆవిష్కరించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి అనిల్ ప్రకాష్ కిరణ్, సగర సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టరాజు సగర, జిల్లా కోశాధికారి కాటిపెల్లి కుమారస్వామి సగర, జిల్లా, రాష్ర్ట నాయకులు, గ్రామాల అధ్యక్ష, కార్యదర్శులు, సగర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.