హుజూరాబాద్, ఏప్రిల్ 20 : ఈనెల 25న నిర్వహించే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని శాసన మండలి విప్ పాడి కౌశిక్ రెడ్డి నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పట్టణంలోని సిటీ సెంటర్ హాల్లో ఈనెల 25న నిర్వహించే బీఆర్ఎస్ జెండా కార్యక్రమంపై గురువారం ఆయన నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలో మొదటిసారిగా గులాబీ జెండా మోసింది తన తండ్రి పాడి సాయినాథ్ రెడ్డి అని… ఆనాడు అత్యంత బలంగా ఉన్న ముద్దసాని దామోదర్ రెడ్డికి వ్యతిరేకంగా నిలబడి బీఆర్ఎస్కు అండగా ఉన్నామని గుర్తు చేశారు. 2001లో కమలాపూర్, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ బలంగా ఉందని, అప్పటి స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీఫ్ చేసిందన్నారు. అందులో తన తండ్రి పాత్ర ఎంతో ఉందని, అయితే 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఎకడో పౌల్ట్రీ ఫాంలలో గుడ్లు ఏరుకుంటున్నా ఈటల రాజేందర్ టికెట్ ఇచ్చి గెలిపించిన మహానుభావుడు కేసీఆర్ అని కొనియాడారు.
ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల తమ కుటుంబాన్ని రాజకీయంగా అణగదొకాడని, క్రికెట్లో లీనమైన నేను అప్పుడే ఆయనను రాజకీయంగా ఓడించాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. దీంతో బీఆర్ఎస్లో ఉన్న తమ కుటుంబం కేవలం రాజేందర్ చేస్తున్న కుట్రలకు కాంగ్రెస్లోకి వెళ్లిందన్నారు. అప్పటి నుంచి 2018 అసెంబ్లీ ఎన్నికల వరకు ఈటల రాజేందర్కు వ్యతిరేకంగా కొట్లాడుతూనే ఉన్నానని, ఆయన బీఆర్ఎస్ను వీడిన తర్వాత తాను గులాబీ గూటిలో చేరానని ఉద్గత స్వరంతో అన్నారు. రాజకీయ బిక్ష పెట్టిన కేసీఆర్ను నోటికి వచ్చినట్లు రాజేందర్ తిడుతుంటే నిఖార్సైన బీఆర్ఎస్ కార్యకర్తలకు సలసల రక్తం కాలాలని, ఎప్పటికప్పుడు ఆయనకు దీటైన జవాబు చెప్పాలన్నారు. దీనికి తన బలం ఒకటే సరిపోదని ప్రతి ఒకరూ తనకు అండగా ఉండాలని కోరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తనను గెలిపిస్తే కేసీఆర్ కాళ్లు పట్టుకొని అయినా వెయ్యి కోట్ల నిధులు నియోజకవర్గ అభివృద్ధికి తెస్తానని చెప్పారు. ఒకే ఒక ఛాన్స్ వచ్చే ఎన్నికల్లో తనకు ఇవ్వాలని, ఇది తన కోసం కాదని కేసీఆర్కు గిఫ్ట్గా ఇద్దామని పేర్కొన్నారు. మంత్రిగా ఈటల రాజేందర్ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమి లేదని, మొన్నటి ఉప ఎన్నికలో కేసీఆర్ పుణ్యమా అని నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు జరిగాయన్నారు.
ప్రతి మంత్రి నియోజకవర్గ అభివృద్ధికి చిరునామాగా మారితే ఇకడ మాత్రం అభివృద్ధి ఎందుకు జరుగలేదని ప్రశ్నించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్ ఓటమి లక్ష్యంగా ప్రతి ఒకరూ పని చేయాలని పిలుపునిచ్చారు. మనమంతా కేసీఆర్ కోసం పని చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధించబోతున్నారనే నమ్మకం తనకు ఉందని, దీనికోసం బీఆర్ఎస్ శ్రేణులంతా పని చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 25న ఉదయం తొమ్మిది గంటలకు ప్రతి గ్రామంలో జెండా ఎగురవేసిన తర్వాత 11 గంటలకు హుజూరాబాద్కు రావాలని ఇకడ పెద్ద ఎత్తున జెండా ఎగురవేసే కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే ఎకడా లేని విధంగా ఆవిర్భావ వేడుకలు జరుగడానికి ప్రతి ఒకరూ స్వచ్ఛందంగా తరలిరావాలని పేరొన్నారు. 25న ప్రతి వాడ, ఊరు గులాబీమయం కావాలని, సెంటర్లలో ఫ్లెక్సీలు కట్టాలన్నారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, సింగిల్ విండో చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మండల, పట్టణ, గ్రామ శాఖ అధ్యక్షులు, వార్డు మెంబర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.