రామడుగు, జనవరి 24: పల్లెల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని రంగశాయిపల్లిలో రూ. 35 లక్షలతో చేపట్టే అభివృద్ధి పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బీఆర్ఎస్ హయాంలో నియోజకవర్గంలోని ప్రతి పల్లె అభివృద్ధి చెందిందని తెలిపారు. కేంద్రం నిధులు విడుదల చేయకున్నా సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. సబ్బండవర్గాలకు చేయూతనందిస్తున్నట్లు తెలిపారు. అన్ని కుల సంఘాల భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ శుద్ధ జలం అందిస్తున్నట్లు తెలిపారు. కాళేశ్వరం జలాలతో నియోజకవర్గం సస్యశ్యామలమైనట్లు పేర్కొన్నారు.
అన్నదాతలకు అండగా నిలుస్తూ రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కొక్కెరకుంట సింగిల్విండో చైర్మన్ వొంటెల మురళీకృష్ణారెడ్డి, రంగశాయిపల్లి, రుద్రారం సర్పంచులు సాదు పద్మ-మునీందర్రెడ్డి, వొంటెల అమరేందర్రెడ్డి, ఎంపీటీసీ గుర్రం దేవిక-రాజశేఖర్గౌడ్, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు ఎడవెల్లి నరేందర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ గంట్ల వెంకటరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు బత్తిని తిరుపతిగౌడ్, కొలిపాక మల్లేశం, కొడిమ్యాల రాజేశం, గుండి ఎంపీటీసీ మడ్డి శ్యాంసుందర్గౌడ్, బీఆర్ఎస్ నాయకులు కలిగేటి లక్ష్మణ్, జాడి రాజమల్లు, పూడూరి మల్లేశం, సురేశ్, కనుకం కనకయ్య, ఎడవెల్లి పాపిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
గంగాధర, జనవరి 24: కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీ బలమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్త గంగాధర శ్రీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం మధురానగర్లో ఎమ్మెల్యే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.