Korutla | కోరుట్ల, నవంబర్ 13: నిర్మల్ కోర్టు ప్రాంగణంలో న్యాయవాది పుట్ట అనిల్ కుమార్ పై పోలీస్ దాడిని నిరసిస్తూ కోరుట్ల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం న్యాయవాదులు విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా పట్టణ బార్ అసోసియేషన్ అధ్యక్షులు బైరి విజయ్ కుమార్ మాట్లాడుతూ న్యాయవాదిపై దాడిని న్యాయవ్యవస్థపైనే దాడులుగా భావిస్తున్నామన్నారు.
న్యాయ పరిరక్షణ, న్యాయవాదుల భద్రతకై అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం అమలులోకి తేవాలని డిమాండ్ చేసారు. భవిష్యత్లో న్యాయవాదులపై దాడులు జరిగితే న్యాయవాదుల మంత ఏకమై పోరాడతారన్నారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు కొరకు కలిసి కట్టుగా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అనంతరం ఇటీవల ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మశాంతి కోసం రెండు నిమిషాల మౌన నివాళులు అర్పించారు.
గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొంపల్లి సురేష్, జాయింట్ సెక్రటరీ చిలివేరి రాజ శేఖర్, స్పోర్ట్స్ సెక్రటరీలు ఫసియుద్దీన్, సుతారి నవీన్ కుమార్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కడకుంట్ల సదశివ రాజు, గోనే సదానంద్ నేత, చాప వందన, జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ రాసభక్తుల రాజ శేఖర్, ఊరడి నరేందర్, లైబ్రరీ సెక్రటరీ మర్రిపల్లి గంగాధర్, సీనియర్ న్యాయవాదులు చాప కిషోర్, కొలుగూరి శ్రీపతిరావు, పలువురు జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.