ధర్మపురి,మార్చి21: ధర్మపురి లక్ష్మీనరసింహస్వామివారి కల్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. గురువారం పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. రాత్రి వేళ శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. నమోఃనారసింహ నామస్మరణతో ఆలయ ప్రాంగణం ప్రతిధ్వనించింది. వేడుకలకు రాష్ట్ర బీసీ సంక్షమే శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే, విప్ ఆది శ్రీనివాస్, జగిత్యాల కలెక్టర్ యాస్మిన్ బాషా హాజరయ్యారు.
ఉదయం కలెక్టర్ ప్రభు త్వ పక్షాన స్వామివారికి పట్టువస్ర్తాలు, కల్యాణ తలంబ్రాలను సమర్పించారు. పట్టువస్ర్తాలతో ఆలయానికి చేరుకున్న కలెక్టర్కు ఆలయ సిబ్బంది మేళతాళాల మధ్య ఘన స్వాగ తం పలికారు. వేద పండితులు మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆమెను ఘనంగా ఆశీర్వదించారు.