Chirumalla Rakesh Kumar | పెద్దపల్లి, జూలై 23(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ 50వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ముందస్తు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. టీఎస్ టీఎస్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చిరుమిల్ల రాకేష్ కుమార్ ఆధ్వర్యంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాకేష్ కుమార్ మాట్లాడుతూ కేటీఆర్ ప్రజాసేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని పార్టీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. సమాజ సేవే కేటీఆర్ జన్మదిన వేడుకల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
ఢిల్లీలో నీట్ విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యను నిరసిస్తూ శుక్రవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అందుకోసమే కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించమన్నారు. ఈ పోరాటానికి మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మొబిన్, మాజీ కౌన్సిలర్లు బిక్షపతి, స్వామి, ఉపసర్పంచ్ మేకల కుమార్ యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కర్ర దేవేందర్ రెడ్డి, పడాల సతీష్ గౌడ్, బింగి రాజు, మేడుదుల రాజ్ కుమార్, ఉప్పు శివ కుమార్, బోయిని మనోజ్, పెంచాల శ్రీకాంత్, కంచి నాగరాజ్, దాసరి సతీష్, ఇరుగురాల స్వామి దాస్, సాయి, వెంకటేష్ తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.