కొత్తపల్లి, సెప్టెంబర్ 25 : స్వచ్ఛ సర్వేక్షణ్-2022 ర్యాంకులను కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించగా, రాష్ట్రంలోని 16 మున్సిపాలిటీలు అవార్డులకు ఎంపికయ్యాయి. దీనిలో 25వేల లోపు ఉన్న జనాభా ఉన్న మున్సిపల్లో కొత్తపల్లి మున్సిపల్ మొదటి ర్యాంకును సాధించి సత్తాచాటింది. దేశవ్యాప్తంగా 25వేల జనాభా ఉన్న మున్సిపాలిటీలు 671 ఉండగా అందులో కొత్తపల్లి మున్సిపల్ మొదటి స్థానం దక్కించుకోవడం హర్షణీ యం. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను ఎంపిక చేసేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ జూలై 2021 నుంచి జనవరి 2022 వరకు జాతీయస్థాయి శానిటేషన్ సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా ఉన్న 4,355 పట్టణ స్థానిక సంస్థల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ నిర్వహించారు. అవార్డుల కోసం 90 అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు.
సిటీ శానిటేషన్, గార్బేజ్ ఫ్రీ సిటీ, ఓడీఎఫ్ ప్లస్ ప్లస్, హోం కంపోస్టింగ్, సెగ్రిగేషన్, డంపింగ్యార్డు రెమిడేషన్, సిటి బెటిఫికేషన్, డోర్ టూ డోర్ చెత్త సేకరణ, కమ్యూనిటీ కంపోస్ట్లతో పాటు మరుగుదొడ్ల నిర్వహణ, పారిశుధ్యంపై స్థానికులకున్న అవగాహన, సృజనాత్మకత తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని సర్వే నిర్వహించగా శనివారం ప్రకటించిన ఫలితాల్లో మొదటి ర్యాంకును సాధించింది. 2021 స్వచ్ఛ సర్వేక్షణ్ ఫలితాల్లో సౌత్ ఇండియా స్థాయిలో 6వ ర్యాంకును సాధించగా వాటిలోని లోపాలను సరిదిద్దుకోవడంతో ప్రస్తు తం మొదటి ర్యాంకును దక్కించుకుంది. పల్లెలు, పట్టణాల రూ పురేఖలు మార్చేందుకు రాష్ట్రంలో అమలు చే స్తున్న పట్టణ ప్రగతితోనే తెలంగాణ 16 ర్యాం కులు సాధించి దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. కాగా ఢిల్లీలో అక్టోబర్ 1న నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మున్సిపల్ చైర్మన్, కమిషనర్ ఈ అవార్డును అందుకోనున్నారు. కొత్తపల్లి మున్సిపల్కు స్వచ్ఛ సర్వేక్షణ్-2022 ఫలితాల్లో మొదటి ర్యాంకు రావడంపై పురపాలక శాఖ మంత్రి కే టీఆర్, బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మం త్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.
మున్సిపల్ ఆవరణలో సంబురాలు..
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్-2022 ఫలితాల్లో కొత్తపల్లి మున్సిపల్కు మొదటి ర్యాంకు రావడాన్ని హర్షిస్తూ ఆదివారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో చైర్మన్ రుద్ర రాజు, కమిషనర్ వేణుమాధవ్, పాలకవర్గ సభ్యులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వాసాల రమేష్, జెర్రిపోతుల మొండయ్య, మానుపాటి వేణుగోపాల్, గున్నాల విజయ రమేష్, ఎస్కె నాజియా బాబా, స్వర్గం వజ్రాదేవి నర్సయ్య, గండు రాంబాబు, చింతల సత్యనారాయణరెడ్డి, వేముల కవితా శేఖర్, కో ఆప్షన్ సభ్యులు కట్ల మమతా సుధాకర్, ఎస్కె షహనాజ్ మునావర్ఖాన్, టీఆర్ఎస్ నాయకులు బండ గోపాల్రెడ్డి, రుద్ర రాధ పాల్గొన్నారు.
పట్టణ ప్రగతే కారణం..
సర్కారు చేపట్టిన పట్టణ ప్రగతితోనే కొత్తపల్లి మున్సిపల్కు జాతీయస్థాయిలోఫస్ట్ ర్యాంకు వచ్చింది. పారిశుధ్య నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ప్రజా ప్రతినిధుల, అధికారుల నిరంతర పర్యవేక్షణతోనే ఈ ఫలితం దక్కింది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి గంగుల కమలాకర్ సహకారంతోనే ఈ అవార్డును దక్కించుకున్నాం.
– రుద్ర రాజు, మున్సిపల్ చైర్మన్, కొత్తపల్లి
అందరి సహకారంతోనే ..
మున్సిపల్ పాలకవర్గం, ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతోనే స్వచ్ఛ సర్వేక్షణ్-2022 ఫలితాల్లో మొదటి ర్యాంకును సాధించాం. ఈ ఆనందం మాటల్లో చెప్పలేను. కొత్తగా ఏర్పాటైన మున్సిపల్లో ముందు నుంచి పారిశుధ్య నిర్వహణలో మెరుగ్గా ఉన్నది. ర్యాంకుతో మాపై బాధ్యత మరింత పెరిగింది.
– వేణుమాధవ్, కమిషనర్, కొత్తపల్లి